నన్ను..క్షమించండి

*నన్ను..క్షమించండి!*


*రాష్ర్ట ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి మాట్లాడుతూ ....*


1.ముస్లిం సోదరులకు, ముస్లిం గురువులకు నా హృదయపూర్వక నమస్కారాలు.
నిన్న తిరుపతిలో మాట్లాడే సమయంలో.. కరోనా పాజిటివ్ కేసులు రావడం గురించి మాట్లాడాను. దానిపైన ముస్లింలను  విమర్శించాలని ఆత్మసాక్షిగా నాకు లేదు.


2.నేను కూడా దళితుడ్ని. నాకు ఎస్సీలు, ఎస్టిలు, బిసిలు మైనారిటీలు అందరూ కూడా ఒకే కులస్తులుగా భావించేవాడ్ని. మనందరం సమాజంలో చాలా వెనకబడినవారం.


3.ఈరోజు వెనకబడిన వర్గాలకోసం రాజకీయ సమానత్వమే కాకుండా రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్దికంగా ఆ వర్గాలను పైకితెస్తూ కులవ్యవస్దను, మతవ్యవస్దను దూరం పెట్టిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.


4.ఒక కులంమీద గాని, మతం మీద గాని దాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు. వారి మత గురువులు ఏ విధమైన ఆదేశాలు ఇస్తే దానిని పాటించే అలవాటు అన్ని మతస్తులకు ఉంది. అదే విధంగా ఢిల్లీలో జరిగిన  సంఘటన ఇతర దేశాలనుంచి వచ్చిన వారి వల్ల పాజిటివ్ కేసులు వచ్చాయి. 


5.అదే విధంగా ఏ మతస్తులు సభలు పెట్టుకున్నాగాని, క్రిష్టియన్ సభలు పెట్టుకున్నాగాని వేరే మతస్తులు గురువులు వచ్చినప్పుడు వాటిక్కూడా బయట దేశస్దులు వస్తే కరోనా పాజిటివ్ రావడం సహజం. అదే విధంగా హిందుమతానికి సంబంధించి ధార్మికమైన మతగురువులు సందేశాలు ఇచ్చేటప్పుడు విదేేశాలనుంచి వస్తే కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది.


6.అందుకని నేను నిన్న పూర్తిగా మైనారిటీ అనే వారు ఏదైనా ప్రసాదం తీసుకుంటే అది కిందపడకుండా స్వీకరించే సాంప్రదాయం దేవుని పైన భక్తితో వారిలో ఉంది. అదేవిధంగా ఇతర మతస్తులు తీర్ధం తీసుకున్నప్పుడు కిందపడకుండా తీసుకునే అలవాటు ఉంది. ముఖ్యంగా నాకు ముస్లింలపై ఎలాంటి ద్వేషం లేదు- ఎలాంటి పగలేదు.


7.నేను మొదటి నుంచి కూడా ముస్లిం సోదరులతోనే ఉండేవాడ్ని. నా రాజకీయ చరిత్రలో కూడా 1981లో హబీబ్ అనే అతనిని సర్పంచ్ గా పోటీ పెట్టించాను. అప్పుడు ఆయన ఓడిపోయినా ఎంకరేజ్ చేశాను. వారి ఇళ్ల స్దలాల విషయంలో గాని వారి సామాజిక అంశాల విషయంలోగాని వారిలో ఒక వ్యక్తిగా కలసిమెలసి వెళ్లే అలవాటు నాకు ఉంది.


8. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలకు ఎటువంటి పదవులు ఇచ్చారు. ఈ సమాజంలో వారిని ఏవిధంగా పైకి తీసుకువచ్చారో కూడా మీ అందరికి తెలుసు.


9.నిన్న నా మాటలు చాలామందికి  బాధాకలిగినట్లు తెలిసింది. ముస్లిం మతస్ధులు కూడా డిప్యూటి సిఎం గా ఉన్న వ్యక్తి మతపరంగా మాట్లాడటం చాలా దారుణం అని బాధపడ్డారని తెలిసింది.


10. నేను వారిని బాధించే విధంగా ఏదైనా మాట్లాడి ఉంటే  నా ఆత్మసాక్షిగా నన్ను మన్నించాలని ముస్లిం మతగురువులను, ముస్లిం మతస్దులను కోరుతున్నాను. ఎందుకంటే మనమంతా మానవులం. ఇండియాలో పుట్టినవాళ్లం. మనం అందరం ఒకే వర్గానికి చెందినవారం. మతద్వేషంగాని, కులద్వేషంగాని నాలో ఎప్పుడూ లేదు.


11.నేను అప్పీలు చేస్తున్నాను. ఎటువంటి పరిస్దితులలో కూడా ముస్లింల మనస్సు బాధించే విధంగా, వారి మనోభావాలు దెబ్బతినేటట్లు ప్రవర్తించను. జరిగిన దానికి బాధపడుతున్నాను. ముస్లిం సోదరులు, వారి మతగురువులు నన్ను క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.


12.మతం, కులం అని లేకుండా మనమందరం సోదరభావంతో కలసిమెలసి ఉండాలని ప్రార్దిస్తున్నాను.


13.ఈ విషయంలో ముఖ్యమంత్రి  నాతో ఈరోజు కూడా ఈ అంశంపై మాట్లాడారు. వారి ఆలోచన ప్రకారం ఏ విధమైన మతద్వేషంగాని, కులద్వేషంగాని ఉండకూడదు.


14.అన్ని మతాల వారు సోదరభావంతో మెలగాలని ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ముస్లిం సోదరులందరికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి ఏ కులస్తులకు కూడా దూరంగా లేరు. ముందుగా వారి తండ్రి వైఎస్సార్ గారు కూడా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది.


15.నేను మతద్వేషం రెచ్చగొట్టేంత నీచమైన వ్యక్తిని కాను. నన్ను మనస్పూర్తిగా క్షమించాలని కోరుతున్నా...


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు