విలేకరులకు కరోనా టెస్టులు నిర్వహించాలి: APJF నేత యేమినేని వెంకట రమణ  (ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ) 

విలేకరులకు కరోనా టెస్టులు నిర్వహించాలి
  
జిల్లా కలెక్టర్,పోలీసు కమిషనర్, వి ఎం సి కమిషనర్, లు చొరవ చూపాలి..........


 యేమినేని వెంకట రమణ  ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం  విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి వినతి
విజయవాడ....ఏప్రిల్ 22  ( అంతిమ తీర్పు);         విజయవాడ నగరంలో కరోనా మహమ్మారి అంచెలంచెలుగా విజృంభిస్తున్న  తరుణంలో విధి నిర్వహణలో ఉన్న విలేకరులకు కరోనా టెస్టులను నిర్వహించాలి 


 విలేకరులందరూ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు.   ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని  నిత్యం వార్తల సేకరణలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తమ విధులను నిర్వహిస్తూ ప్రజాప్రతినిధుల కార్యక్రమాలను సేకరిస్తూఉంటారు 


.కరోనా మహమ్మారి కారణంగా ఒక్క పక్క తమను తాము కాపాడుకుంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ వార్తల సేకరణలో నిమగ్నమయ్ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 


 అందుకు ఉదాహరణ ముంబాయి లో 6గురు విలేకరులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అవడమే 


.ఈ విషయమై అప్పటికప్పుడు ప్రభుత్వం కదిలి విలేకరులకే కాకుండా ప్రజాప్రతినిధులకు,కార్యకర్తలకు కరోనా పాజిటివ్ టెస్టులు నిర్వగించాలి   కరోనా వలన ముంబాయ్ నగరం గందరగోళంగా మారింది. 
ముంబాయి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాకుండా ముఖ్యంగా కార్యక్రమాలు ఎక్కువుగా జరిగే పట్టణ ప్రాంతాలలో ప్రజాప్రతినిధుల కార్యక్రమాలలో పాల్గొటుంన్న విలేకరులకు ముందస్తు కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఎటువంటి సమస్యలు ఉండవని విలేకరులు భావిస్తున్నారు.


ఒక విలేకరికి కరోనా పాజిటివ్ వచ్చినా మిగిలిన విలేకరులకు రాదని నమ్మకం లేదు విధి నిర్వహణలో వార్తలను,ఫొటోలను,వీడియోలను ఒకరి నుంచి ఒకరు పంచుకుంటారు.అంతేకాక ప్రజాప్రతినిధులతో,ప్రజలతో మమైకంగా ఉంటారు. 


ఎటువంటి అత్యవసర పరిస్థితి అయినా అధికారులతో పాటు వార్తల సేకరణ కోసం పరుగులు తీస్తుంటారు.ఇలాంటి నేపధ్యంలో ప్రజాప్రతినిధులు స్పందించి విలేకరులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తే విలేకరుల కుటుంబాలకే కాకుండా సమాజానికి మేలుచేసిన వారవుతారు.
వార్తలు సేకరణలో భాగంగా విలేకరులు ముందు వెనకా ఆలోచించకుండా  బ్రేకింగ్ న్యూస్ కోసం పరుగులు తీస్తున్నారు ...


పోలీసులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు  సిబ్బంది, కరోనా నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను గ్యాప్ లేకుండా నిరంతరం ప్రజల్లోకి వార్తలు చేరవేస్తున్న విలేకరులు ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు 


విలేకరుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో,  నగరంలోని  ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా,  విలేకరుకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నాను  


ఈ విషయంలో మంత్రులు ,ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొంటే రాష్ట్రంలో వేలాదిమంది విలేకరుల కుటుంబాలను ఆదుకొన్నవారవుతారు ...యేమినేని వెంకట రమణ  ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం  విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి .....


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు