కరోనా విపత్తులో నాయీబ్రాహ్మణ లను ప్రభుత్వం ఆదుకోవాలి:: నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు

కరోనా విపత్తులో నాయీబ్రాహ్మణ లను ప్రభుత్వం ఆదుకోవాలి:: నాయీబ్రాహ్మణ జేఏసీ;


^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^


కరోనా విపత్తు లాక్ డౌన్ లో బార్బర్ షాపులు బంద్ చేయటం ద్వారా రెక్కాడితే కానీ డొక్కాడని నాయీబ్రాహ్మణ వృత్తిదారులు, శుభకార్యాలు లేక మంగళ మంగళ మేళతాళాలు మూగబోయి, దేవాలయాలలో తలనీలాలు తీయించుకునే భక్తులు లేక క్షురకుల జీవనం అగమ్యగోచరంగా మారి దిక్కుతోచనిస్థితిలో ఉన్న నాయీబ్రాహ్మణ లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు నేడొక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.


హిందూ దేవాలయాలలో పూజారులను, చర్చిలలో ఫాదర్స్ ని, మసీదులో ఇమాం లను ప్రభుత్వం ఆదుకుని ఏ పూటకు ఆపూట వృత్తిని నమ్ముకుని జీవించే నాయీబ్రాహ్మణ లను ఆదుకోకుండా ప్రభుత్వం వివక్షత కు గురిచెయ్యటం సరికాదని, ఆకలి కేకలతో ఆకలి చావులకు గురికాక ముందే క్షవర వృత్తిదారులను యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి నాయీబ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని నరసింహారావు ఆవేదన చెందారు.


సంక్షేమ పథకాలు తో ముడిపెట్టకుండా కరోనా లాక్ డౌన్ లో నాయీబ్రాహ్మణ డకు గ్రామస్తాయిలో 10 వేలు,పట్టణ నగర స్థాయిలో 15 వేల రూపాయిలు సహాయం అందించి ఆదుకోవాలని, కరోనా సంక్షోభం ముగిసేవరకు బార్బర్ షాపుల అద్దెలు,ఇంటి అద్దెలు పూర్తి రాయితీ ఇవ్వాలని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ బార్బర్ షాపులకు250 యూనిట్స్ కరంటు రాయితీ ఈ సందర్భంగా అమలు చేయాలని కోరారు.


ప్రతి బార్బర్ షాప్ కి ఒక స్టజిలేజర్, p p e కిట్టు ఒకటి అందించి లాక్ డౌన్ లో 6am to 9am వరకు టైం సడలింపు విజ్ఞప్తి చేసారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి,ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి నాయీబ్రాహ్మణ లకు సమస్యల గురించి విన్నవించటం జరిగిందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వలు వెంటనే స్పందించి ఆదుకోవాలని ఆంద్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు తాటికొండ నరసింహారావు ప్రభుత్వాలను డిమాండు చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు