ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ

బహిరంగ లేఖ
తేది: 28.04.2020
నా ఆత్మీయ కుటుంబసభ్యులైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు
నమస్కారాలు. 
ఈ పరిస్థితుల్లో మీకు ఇలా బహిరంగ లేఖ రాయాల్సివస్తుందని ఊహించ లేదు.  
 ఒక అసాధారణ, సంక్లిష్ట పరిస్థితిలో ప్రస్తుతం మన దేశం, మన రాష్ట్రం ఉన్నాయి. మానవ జాతి చరిత్రలో, నాగరిక సమాజం ఎదుర్కొన్న పెను విపత్తులలో కరోనా సంక్షోభం కనీవినీ ఎరుగనిది. 4నెలల్లోనే మిలియన్ల సంఖ్యలో వ్యాధి బారిన పడటం, లక్షలాదిగా మరణించడం కరోనా వైరస్ తీవ్రతకు నిదర్శనం. ఏ దేశంలో చూసినా రోజుకు వేలాదిమంది కరోనా వ్యాధి బారిన పడుతున్నారు.  గత వారం రోజుల్లోనే మన రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వ లెక్కలే వెల్లడిస్తున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నాం. 
ఈ క్లిష్ట సమయంలో, ఎల్లప్పుడూ మీ క్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా, లాక్ డౌన్ నిబంధనలు మీరందరూ పాటిస్తూ, పరిశుభ్రతకు, ఆరోగ్య సంరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, చిన్నపిల్లల, వృద్దుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని భావిస్తున్నాను. 
కరోనా వైరస్ కు  వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. అప్పటిదాకా ముందు జాగ్రత్తలే దీనికి మందు. భౌతిక దూరం పాటించడం, పదేపదే చేతులు శుభ్రపర్చుకోడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక శుభ్రత పాటించాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎక్కడా గుంపులుగా గుమికూడరాదు. ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలి. 
 కరొనా మహమ్మారి భయోత్పాతం, మన జీవితాలతో పాటు, మన జీవనోపాధిని కూడా ప్రమాదంలోకి నెట్టింది. 
అత్యంత దుర్భరంగా వలస కార్మికులు, చేతివృత్తులవారి పరిస్థితి : 
వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. పనిచేసే చోట ఉపాధి కోల్పోయి, అక్కడ ఉండలేక స్వస్థలాలకు వెళ్లేందుకు వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. కాలినడకన వేల కిమీ నడిచి వెళ్లడానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే మనసు కలిచివేస్తోంది. జీవనోపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులవారు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, చర్మకారులు, ఆటో డ్రైవర్లు ఇతర అసంఘటిత కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. 
ఈ పరిస్థితుల్లో ‘‘అన్నా కేంటిన్లు’’ ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉండేవనే వ్యాఖ్యలు పాలకుల చెవులకు వినిపించక పోవడం బాధాకరం. ‘‘చంద్రన్న బీమా పథకం’’ ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు, లాక్ డౌన్ లో మరణించిన వారి కుటుంబాలకు ఆధారంగా ఉండేది.  
 రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: 
రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. రబీ పంట చేతికి వచ్చే సమయానికి కూలీలు దొరకక, రవాణా స్థంభించి,మార్కెటింగ్ సౌకర్యాలు లేక, పండించిన పంటను పొలంలోనో, రోడ్డుమీదో వదిలి నిస్సహాయంగా, పగిలిన గుండెలతో జీవచ్చవంలా మారారు. రబీ పంటలు, హార్టీకల్చర్, ఆక్వా, సెరికల్చర్ రైతాంగాన్ని ఆదుకోవాలని, పంట ఉత్పత్తులను ప్రభుత్వమే ముందుకొచ్చి కొనాలని, మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి ఉపయోగించాలని అనేక లేఖలు రాసినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం బాధాకరం. వేలం ఆలస్యం కారణంగా పొగాకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో కొన్న ధాన్యంలో పదో వంతు కూడా మన రాష్ట్రంలో కొనక పోవడం శోచనీయం. పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే ఇప్పుడీ అకాల వర్షాలు, తుపాన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేది కాదు.  
విపత్తులలోనే నాయకత్వ సామర్ధ్యం బైటపడేది: 
ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ విపత్తులలో ప్రజలకు అండగా నిలబడింది. ‘‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లనే’’ ఎన్టీఆర్ సూక్తికి కట్టుబడింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సేవకే అంకితమైంది. 
విపత్తులలోనే నాయకత్వ సామర్ధ్యం బైటపడేది. క్షేత్ర స్థాయిలో ఉపశమన చర్యలు తీసుకోవడంతోపాటు యంత్రాంగానికి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా సహాయ, పునరావాస చర్యలను వేగిరపర్చడమే నాయకత్వ లక్షణం.  ప్రతిపక్షంలో ఉండి కూడా 2009 కృష్ణా వరదల్లో, ఉత్తరాఖండ్ వరదల్లో బాధితులను, గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో టిడిపి ముందుండి అండగా నిలబడింది. గోదావరి జిల్లాలలో పెనుతుపాన్ సమయంలో, ఒడిశా వరదల్లో, విశాఖ హుద్ హుద్ బీభత్సంలో, శ్రీకాకుళం తిత్లి తుపాన్ లో టిడిపి ప్రభుత్వం ఏవిధంగా సహాయ, పునరావాస చర్యలు చేపట్టి బాధితులను ఆదుకుందో మీకు తెలిసిందే. మొత్తం సెక్రటేరియట్ తో సహా కేబినెట్ మంత్రులంతా అక్కడే మకాం వేసి సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా అవిశ్రాంతంగా పని చేయడాన్ని గుర్తు చేస్తున్నాను.
బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలకు అండగా తెలుగుదేశం: 
 ప్రస్తుత కరోనా విపత్తులో కూడా తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా అదే స్ఫూర్తితో పని చేస్తోంది. కరోనా తీవ్రతను ముందుగానే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరించాం. వ్యాధి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాం. పరిశుభ్రత ప్రాధాన్యత వివరించి ప్రజలను చైతన్య పరిచాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేదానిపై ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ప్రెస్ మీట్లు, వీడియోలు, కరపత్రాల ద్వారా అవగాహన పెంచాం.
 లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే, ప్రతి రోజూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ, పేదలు, రైతుల సమస్యలపై లేఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సూచనలు ఇస్తున్నాం. ప్రధాన మంత్రికి, కేంద్ర మంత్రులకు, కేంద్ర అధికారులకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గవర్నర్ గారికి అనేక లేఖలు రాశాం. జిల్లా స్థాయిలో టిడిపి నాయకులు కూడా  కలెక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి జిల్లా పార్టీ తరఫున లేఖలు పంపారు. 
టిడిఎల్ పి సమావేశం ఆన్ లైన్ లో నిర్వహించి కరోనా బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల వేతనాలను సిఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందజేశాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రెండున్నర లక్షల మాస్క్ లు ఫ్రంట్ లైన్ వారియర్లకు పంపిణీ చేస్తున్నాం. ఆన్ లైన్ లో ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమార్లు విజ్ఞప్తి చేశాం. 
అయినా పట్టించుకోక పోవడంతో రైతులు, పేదల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు ఇళ్లలోనే 12గంటల నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని, రబీ పంటలు (ధాన్యం, మొక్కజొన్న, పత్తి, మిర్చి, పసుపు, టమాటా,కూరగాయలు...) పండ్ల తోటల ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని, అన్నా కేంటిన్లు, చంద్రన్న బీమా పునరుద్దరించాలనే డిమాండ్లతో ఇప్పటికే అనేకమంది టిడిపి నాయకులు 12గంటల దీక్షలు చేశారు. వివిధ మండలాల పార్టీ నాయకులు కూడా దీక్షలు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పేదలు, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టేలా కృషి చేస్తున్నాం. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా టిడిపి నేతలు క్రమశిక్షణతో భౌతిక దూరం పాటిస్తూ పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు ఆయా ప్రాంతాల్లోని పేదలకు  పంపిణీ చేశారు. 
వైసిపి నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి: 
అయితే అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కనీసం కంటైన్ మెంట్ జోన్లలో కూడా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అందువల్లే మన రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ  ఉధృతం అయ్యింది. 
మొదట తేలిగ్గా మాట్లాడటం, తర్వాత చేతగానితనం బైటపెట్టడం పాలకుల లక్షణం కాదు. అప్పుడు ‘‘కరోనా వస్తుంది, పోతుంది, పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’’ అని తేలిగ్గా వ్యాఖ్యలు, ఇప్పుడు ‘‘కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది’’ అనే వ్యాఖ్యలు పాలకుల డొల్లతనాన్ని బైటపెట్టాయి. అన్నివర్గాల ప్రజలను ఆవేదనకు గురిచేశాయి.
కరోనా కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యమనే  వారి వ్యవహార శైలి రాష్ట్రాన్ని ‘‘పెనం మీదనుంచి పొయ్యిలోకి’’ నెట్టింది. వైసిపి నాయకులు యధేచ్ఛగా గుంపులుగా తిరుగుతూ శ్రీకాళహస్తిలో ట్రాక్టర్లతో ర్యాలీలు జరపడం, నగరిలో పూలు జల్లుకుంటూ ప్రారంభోత్సవాలు జరపడం, పొరుగు రాష్ట్రం నుంచి వాహనాల్లో అనుచరులను కనిగిరి ఎమ్మెల్యే తరలించడం, లాక్ డౌన్ లో కూడా కొండెపిలో బహిరంగ సభలు పెట్టడాన్ని జాతీయ మీడియా కూడా తప్పుపట్టింది. 
వాలంటీర్ల వేతనాలకు వేల కోట్లు ఖర్చు చేస్తూ, ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీలో వైసిపి ప్రభుత్వం విఫలమైంది. చౌకడిపోల వద్ద వందలాది మందిని క్యూలైన్లలో గంటల తరబడి నిలబెట్టడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమైంది.  లాక్ డౌన్ ఉల్లంఘించి వైసిపి నాయకులు, వారి అనుచరులు యధేచ్చగా రాష్ట్రవ్యాప్తంగా వాహనాల్లో తిరుగుతూ వైరస్ వ్యాప్తికి సూపర్ స్ప్రెడర్లుగా తయారయ్యారనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. 
లాక్ డౌన్ లో కూడా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నాటు సారా విక్రయాలు పేట్రేగి పోయాయని సాక్షాత్తూ శాసన సభ స్పీకర్ తప్పు పట్టడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది.
హెల్త్ బులెటిన్లను ఫార్స్ గా మార్చారు-కరోనా కిట్లలోనూ అవినీతికి పాల్పడ్డారు: 
విదేశాల్లో, ఇతర రాష్ట్రాలలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ 4టి విధానం సత్ఫలితాలు ఇస్తుంటే మన రాష్ట్రంలో సరైన దిశానిర్దేశం కొరవడటం బాధాకరం. హెల్త్ బులెటిన్లను కూడా మన రాష్ట్రంలో ఒక ఫార్స్ గా మార్చారు. వాటిలో అంకెల గారడీపై మీడియాలో వార్తలు రావడంతో రోజుకు 3బులెటిన్ల బదులు ఒక్కదానికే తగ్గించారు. 
చివరికి కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో కూడా అవినీతికి పాల్పడటం హేయం. ఎన్ని ఎక్కువ టెస్ట్ లు జరిపితే కరోనా వైరస్ ను అంతగా కట్టడి చేయగలమనేది ప్రపంచవ్యాప్తంగా రుజువైన అంశం కాగా,  మన రాష్ట్రంలో మాత్రం టెస్టింగ్ లను నిర్లక్ష్యం చేయడమే పెను విషాదం అయ్యింది. 
పిపిఈలు ఇవ్వకపోవడం వల్లే డాక్టర్ల ప్రాణాలు బలి: 
ప్రాణాలు కాపాడే డాక్టర్లు, వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వారి ప్రాణాలనే బలిగొంటోంది. నాసిరకం పిపిఈలతో కరోనా వైరస్ పై యుద్దానికి వారిని పంపడం ఆత్మహత్యా సదృశమే. కర్నూలు, నెల్లూరు డాక్టర్ల విషాదాంతమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. గుంటూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు తదితర జిల్లాలలో అనేకమంది డాక్టర్లు, వైద్య సిబ్బందికి వైరస్ సోకడమే వారికి సరైన పిపిఈలు లేకపోవడానికి నిదర్శనం. భద్రతా పరికరాలు(పిపిఈ) అడిగిన డాక్టర్ ను, మున్సిపల్  కమిషనర్ ను సస్పెండ్ చేసిన చరిత్ర ఎక్కడా లేదు. 
 ఎంపి కుటుంబానికి, రాజ్ భవన్ లో పలువురికి వైరస్ సోకడం- వైసిపి ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట:
ఒక ఎంపి కుటుంబంలో 6గురికి వైరస్ సోకడం, వారిలో 4గురు డాక్టర్లు కావడం, గవర్నర్ నివాసం రాజ్ భవన్ లోనే పలువురికి వైరస్ సోకడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట. డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్ట్ లు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ నాణ్యమైన భద్రతా పరికరాలు (పిపిఈలు) అందించాలని ఎన్నిలేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం. 
ప్రధానమంత్రి 4సార్లు ముఖ్యమంత్రులతో ఆన్ లైన్ సమావేశాలు జరిపి, మాజీ రాష్ట్రపతులు, ప్రధానులతో, ప్రతిపక్ష నాయకులతో సంప్రదించి పరస్పర అభిప్రాయ సేకరణతో ఉపశమన చర్యలు చేపడుతుంటే, అటువంటి చొరవ, సామర్ధ్యం మన రాష్ట్ర పాలకుల్లో లేకపోవడం శోచనీయం. ప్రజల ప్రాణాలతో పాలకులే చెలగాటం ఆడటం గతంలో ఎన్నడూ చూడలేదు. 
వైసిపి రంగులపై ఉన్న శ్రద్ద కరోనా టెస్టింగ్ లపై లేదు: 
రాజకీయ లాభాలపై ఉన్న శ్రద్ద వైసిపి నాయకులకు ప్రజారోగ్య పరిరక్షణపై లేదు. స్థానిక ఎన్నికలపై ఉన్న ఆసక్తి, కరోనా వైరస్ నియంత్రణపై లేదు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల ప్రధానాధికారిని తొలగించడం, హుటాహుటిన చెన్నై నుంచి మరో వ్యక్తిని ఆ స్థానంలో నియమించడం, ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపివ్వడం, వైసిపి నాయకులంతా ర్యాలీలు జరపడం, నగదు పంపిణీ చేస్తూ ఓట్లు వేయాలని కోరడం, గుంపులుగా తిరగడం వల్లే రాష్ట్ర ప్రజలు ఇన్ని మూల్యాలు చెల్లించాల్సి వచ్చింది. 
ఈ పరిస్థితులన్నీ చూసే పొరుగు రాష్ట్రాలన్నీ సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. కర్నూలు పోవద్దని మహబూబ్ నగర్ వాసులను ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది. మన రాష్ట్రం నుంచి తమిళనాడులోకి రాకుండా ఏకంగా రోడ్లకు అడ్డంగా గోడలు కట్టడం గమనార్హం.
రాజధాని తరలింపుపై ఉన్న శ్రద్ద, రాష్ట్రంలో ప్రజల ప్రాణాలపై లేకుండా పోయింది. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేయడంలో చూపే ఆసక్తి, ప్రజలకు వైరస్ టెస్టింగ్ లు నిర్వహించడంలో లేకపోవడం మన రాష్ట్రంలో పాలకుల ప్రాధాన్యాలకు ప్రత్యక్ష రుజువు. నన్ను నిందించినా, టిడిపిని దూషించినా ప్రజల కోసం భరిస్తాం. కానీ రాష్ట్రానికి తీరని నష్టం చేయడాన్ని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని భరించలేం. 
 ‘‘మన ఊరు-మనవార్డు- మన సమాజాన్ని’’ మనమే కాపాడుకోవాలి: 
ప్రజలను ఆదుకోవాల్సిన పాలకులు బాధ్యత విస్మరించారు. అధికారులు స్వతంత్రంగా వ్యవహరించి బాగా పనిచేసిన చోట్ల కొంతమేర సత్ఫలితాలు వచ్చాయి. వైసిపి నాయకులు ఇష్టారాజ్యంగా చేసిన చోట్ల దుష్ఫలితాలు చూశాం.  ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలే ముందుకొచ్చి తమ పౌర బాధ్యతలు నెరవేర్చాలి. ‘‘మన ఊరు-మన వార్డు-మన సమాజాన్ని’’ మనమే కాపాడుకోవాలి. 
     చివరిగా....మీ శ్రేయోభిలాషిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఒక మాట. కష్టాలు కల కాలం ఉండవు. అందుకే అందరూ ధైర్యంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో భవిష్యత్ వైపు దృష్టి సారించాలి. కరోనా నేర్పిన పాఠాలతో, ఆరోగ్యంలో ముందు జాగ్రత్తలు పాటిస్తూ, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ధృడత్వాన్ని పెంచుకోవాలి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటూ, సామాజిక బంధాలను పరిరక్షించుకుంటూ, మనందరం ఆరోగ్యంగా, క్షేమంగా ఉందాం.. సమాజాన్ని సురక్షితంగా ఉంచుదాం. 
నారా చంద్రబాబు నాయుడు
(శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత)


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
*ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా శ్రీనివాసులురెడ్డి* వింజమూరు, ఆగష్టు 22 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి, వింజమూరు మరియు చాకలికొండ పంచాయితీల సమన్వయ సెక్రటరీ బంకా. శ్రీనివాసులురెడ్డి ఎంపికయ్యారు. ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సంధర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారుల పేర్లును జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించడం ఆవవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా ఈ యేడాది శ్రీనివాసులురెడ్డి ఉత్తమ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత 5 సంవత్సరాల క్రితం మండలంలోని చాకలికొండ పంచాయితీ కార్యదర్శిగా నియమింపబడిన బంకా. శ్రీనివాసులురెడ్డి విధి నిర్వహణలో భాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమర్ధవంతమైన పంచాయితీ సెక్రటరీగా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఆయనను వింజమూరు మేజర్ పంచాయితీ ఇంచార్జ్ ఇ.ఓగా కూడా ఉన్నతాధికారులు నియమించడం జరిగింది. చురుకైన స్వభావం కలిగిన శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి గా అదనపు విధులలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలో వింజమూరులో శ్రీనివాసులురెడ్డి సేవలు పతాక శీర్షికలలో నిలిచాయి. పారిశుద్ధ్యం మెరుగుకు పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులను ముందుండి నడిపించారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలలో పగలూ రేయీ అనే తేడా లేకుండా నిరంతర పర్యటనలు చేసి బ్లీచింగ్, హైపోక్లోరెడ్ ద్రావణాలు చల్లించి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసులురెడ్డి ఉత్తమ పంచాయితీ సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు గానూ విధి నిర్వహణలో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, తహసిల్ధారు సుధాకర్ రావు, రక్షణ వలయాధికారి బాజిరెడ్డి తదితర మండల స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు, సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లుకు, జర్నలిస్టులకు, వింజమూరు, చాకలికొండ గ్రామ పంచాయితీల ప్రజలకు ధన్యవాదములు తెలియజేశారు.
Image
అంధకారమయ ప్రపంచంలో కాంతిని పెంచడానికి మీ కళ్లని దానం చేయడమే ఒక మహోన్నత కార్యం 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించే కంటి దాన వారోత్సవాల సందర్భంగా కళ్ల దానం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూపు మనిషికి దేవుని ద్వారా ప్రధానమైన ఐదు ప్రధానమైన లక్షణాలైన వాసన, తాకడం, వినడం మరియు రుచి లలో ఒకటి. అందులో చూపు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చూపు మానవుని జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున దీనిని పోగొట్టుకోవడం లేదా అంధత్వాన్ని పొందడం మానవుని వ్యక్తిగత జీవన పయనంలోనే కాకుండా అతని కుటుంభలోనూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనిషి ప్రతి రోజూ నిర్వహించే దైనిందిన కార్యక్రమాలైన నడక, చదవగలుగడం, ఇతరులతో మాట్లాడడం, చదువు లేదా ఉద్యోగావకాసాలు దెబ్బతినడం, సమాజిక వ్యవస్థలను వినియోగించుకొనే సామర్థ్యం దెబ్బతినడం లాంటి ఎన్నో ఇబ్బందులను చూపు కోల్పోయిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం కంటిని పరిరక్షించుకోవడం లేదా అవసరమైన చికిత్సను పొందడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ ప్రజలు అంధత్వం లేదా చూపు సరిగ్గా కనిపించకపోవడం వంటి ఇబ్బందులతో భాదపడుతున్నారు. ఇలా భాదపడుతున్న వారిలో 1 బిలియన్ అంటే సగానికి పైగా మనుషులలో ఈ ఇబ్బందిని సరైన చికిత్స అందించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇక కంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారిలో 123.7 మిలియన్ సంఖ్యలో ప్రజలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను సరైన సమయంలో చికిత్స ద్వారా నయం చేయకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారని, 4.2 మిలియన్ మంది కార్నియల్ బ్లైండ్ నెస్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇక 65.3 మిలియన్ ప్రజలు కాటరాక్ట్ కారణాగా 6.9 మిలియన్ ప్రజలు గ్లుకోమా వలన తర్వాత చివరగా 10.4 మిలియన్ సంఖ్యలోని ప్రజలు వయస్సు మీద పడిన కారణంగా తలెత్తే మాక్యులర్ డీజనరేషన్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంఖ్య చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం అంధత్వం బారిన పడుతున్న వారిలో 50 సంవత్సరములకు పైబడిన వారుంటున్నారని అయితే మిగిలిన వయస్కులు కూడా ఈ కోవలో చేరుతున్నారని తెలుస్తుంది. ఇక అంధత్వం లేదా చూపు తగ్గిపోవడం బారిన ఎక్కువగా పేద లేదా అభివృద్ది చెందుతున్న దేశ ప్రజలు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది...ఇందుకు ప్రధానంగా ఆయా దేశాలలో సరైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. ఇక మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని అంధులలో 50 శాతం భారత దేశంలోనే ఉండడం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2020 నాటికి 10.6 మిలియన్ ప్రజలు కార్నియల్ బ్లైండ్ నెస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చూపు కోల్పోతున్న వారిలో 3 మిలియన్ ప్రజలకు కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్త కార్నియా పెట్టడం ద్వారా చూపు తెప్పించవచ్చు. వీరందరికీ కార్నియా అందజేసి చూపు తెప్పించాలంటే ఏటా 1,50,000 కార్నియా ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను ఏటా మన దేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తద్వారా కార్నియల్ బ్లైండ్ నెస్ ను రూపుమాపాలంటే చనిపోయిన వ్యక్తి ద్వారా కళ్లను సేకరించడమే మార్గం. అందుకే ఏటా 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ ఏటా కంటి దానం పై దేశ వ్యాప్తంగా కంటి దాన వారోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కంటి దానంపై అవగాహన కలిపించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కంటి దానానికి సంబంధించిన పలు అంశాలను డా. అల్వా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్, కొండాపూర్ వారి ద్వారా తెలుసుకుందాం.... కంటి దానమంటే ఏమిటి? ఒక వ్యక్తి (పురుషుడు లేదా మహిళ) చనిపోయిన తర్వాత వారి కళ్లను ఇతరులకు అమర్చడానికి వీలుగా దానం చేయడం. కంటి బ్యాంక్ (eye bank) అంటే ఏమిటి? కంటి బ్యాంక్ లేదా ఐ బ్యాంక్ లనేవి లాభాపేక్ష లేకుండా కంటి దానానికి అంగీకరించిన వ్యక్తులు చని పోయిన తర్వాత వారి నుండి కళ్లను సేకరించి, భద్రపరచి, సరైన రీతిలో పరీక్షించి అవసరమైన వారికి అందజేసే వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొదటి సారిగా 1944 లో న్యూయార్క్ నగరంలో డా. టౌన్ లే పాటన్ మరియు డా. జాన్ మెక్లీన్ లు ప్రారంభించారు. భారత దేశంలో 1945 లో ఐ బ్యాంక్ ను డా. RES ముత్తయ్య, దేశంలోనే మొదటి విజయవంతంగా నిర్వహించబడిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యునిచే చెన్నయి లోని రీజనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్తమాలజీ వారు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటి వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు, ప్రజలు దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కలిపిస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఐ బ్యాంకు లు.... 1. రామాయమ్మ అంతర్జాతీయ ఐ బ్యాంక్, యల్ వి ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్, బంజారా హిల్స్ 2. చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు 3. ఐ బ్యాంక్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, హైదరాబాదు 4. మాదవ నేత్ర నిధి, పుష్పగిరి విట్రోరెటీనా ఇన్సిస్టిట్యూట్ 5. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆప్ ఇండియా కార్నియల్ బ్లైండ్ నెస్ లేదా అంధత్వం అంటే ఏమిటి? కార్నియా అనేది కంటిలో అత్యంత బాహ్యమైన లేదా మొదలు భాగంలో ఉండే పారదర్శకత్వంతో కూడిన కంటి భాగం. ఇది రంగులు కలిగి ఉండేలా కనిపిస్తుంది. ఈ కార్నియా వెనుకాల భాగంలో ఐరిస్ అనబడే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ ఉండే రంగును బట్టి కళ్లు బ్రౌన్, బ్లాక్, బ్లూ లేదా గ్రీన్ కలర్స్ లో కనిపించడం జరుగుతుంది. కార్నియా పారదర్శకంగా ఉండి మనం చూసే ఆకృతి యొక్క ప్రతిబింబం ను రెటీనా పై పడేలా చేస్తుంది. ఈ కార్నియా తన పారదర్శకతను కోల్పోతే చూపు తగ్గిపోవడం కాని పూర్తిగా లోపించడం జరుగుతుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్స ఉందా? కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్సగా దెబ్బతిన్న కార్నియా ను తొలగించి ఆరోగ్యమైన కార్నియా తో మార్పిడి చేయడం అంటే పూర్తిగా గాని లేదా పాక్షికంగా కాని చేయాలి. ఈ మార్పిడిని చని పోయిన వారి కళ్ల నుంచి సేకరించిన కార్నియా ద్వారా చేస్తారు. బ్రతికున్న వారు కళ్లను దానం చేయవచ్చా? లేదు. బ్రతికున్న వారు దానం చేయడానికి అనర్హులు. నా కళ్లను నేను ఎలా దానం చేయగలను? ఒకరి కళ్లను దానం చేయడానికి నిర్ణయించుకొన్నపుడు వారు ఐ బ్యాంక్ లను కలిగిన హాస్పిటల్స్ లేదా సంస్థలను సంప్రదించి తత్సంబదిత ధరఖాస్తును నింపాలి. వీటిని ప్రస్థుతం ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. http://ebai.org/donator-registration/ పైన పేర్కొన్న లింక్, ఐ బ్యాంక్ అపోసియేషన్ ఆఫ్ ఇండియా వారిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ముందుగా కుటుంభ సభ్యులకు తెలిపి వారి సమ్మతి తీసుకోవడం అవసరం. దానితో పాటూ ఐ బ్యాంక్ వారి ఫోన్ నెంబర్లను భద్రపరుచుకోవడంతో పాటూ దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులు వెను వెంటనే ఐ బ్యాంక్ వారికి అంటే చనిపోయిన 6 గంటలలోగా తెలయచేయాలి. ఇందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాఆ ప్రాంతంలోని ఐ బ్యాంక్ ను సంప్రదించవచ్చు. చనిపోయిన వ్యక్తి కళ్లను ఐ బ్యాంకు వారు తీసుకొనే వరకూ కంటిపై తడి గుడ్డను ఉంచడం ద్వారా వాటిని కాపాడాలి. ఐ బ్యాంక్ ను ఎలా సంప్రదించాలి? భారత దేశంలో ఐ బ్యాంకును సంప్రదించడానికి ఉన్న కాల్ సెంటర్ నెం. 1919. దీనికి కాల్ చేయడం పూర్తిగా ఉచితం మరియు భారత దేశమంతా 24 గంటలూ అన్ని రోజులు పని చేస్తుంది. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ఐ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు. ఐ బ్యాంకుకు వ్యక్తి మరణ సమాచారం తెలిపినపుడు ఏం జరుగుతుంది? వ్యక్తి మరణించిన వెంటనే ఐ బ్యాంకు కు మీరు కళ్ల దానం చేయాలన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే కంటి వైద్యునితో కూడిన నిపుణుల బృందం వెంటనే మీ ఇంటికి చేరుకుంటుంది. ముందుగా కుటుంభ సభ్యులకు వారు విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి తగిన అనుమతులు తీసుకొన్న తర్వాత చని పోయిన వ్యక్తి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వెంటనే చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు ఎటువంటి అంతరాయం కలుగని రీతిలో 10 నుంచి 15 నిమిషముల వ్యవధిలో ఈ నిపుణుల బృందం కళ్లను సేకరిస్తుంది. పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిపించే రీతిలో ఎవరికీ కనిపించకుండా వీరు తమ పనిని పూర్తి చేస్తారు. పూర్తయిన పిమ్మట మనిషి శరీరంలో ఎటువంటి ఛాయలు లేకుండా పూర్తిగా సాధారణ స్థితిలో కనిపించేలా చేసి పరిసరాలను శుభ్రం చేస్తారు. అంటే అసలు అక్కడ ఇలాంటి పని జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా సరి చేయడం, శుభ్రం చేయడం చేస్తారు. అనంతరం నిపుణులు బృందంలో ఉండే సోషల్ వర్కర్ కుటుంభ సభ్యులకు కళ్ల దానానికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ను అందజేసి సేకరించిన కళ్లను వెంటనే ఐ బ్యాంక్ కు తరలిస్తారు. ఇలా సేకరించిన కళ్లను మూడు నుండి నాలుగు రోజులలోగా ఇతరులకు వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వీటిని ఎక్కువ కాలం కూడా భద్ర పరచడం జరుగుతుంది. ఇక దాత మరియు దానం స్వీకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సాధారంగా కళ్లను ఎవరికి అమర్చారన్న సమాచారాన్ని దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులకు అందజేయరు. కంటిని దానం చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తి కళ్లను తీయడానికి రెండు పద్దతులు ఉపయోగిస్తారు. కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో కొంత రక్తస్రావం జరుగవచ్చు. అయితే అది ఎక్కువగా కాకుండా నిపుణులు శిక్షణ పొంది ఉంటారు. ఇలా కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ షీల్డ్ ను కాని లేదా కాటన్ ప్లగ్ ను పెడుతారు. తద్వారా మనిషి ముఖంలో ఎలాంటి మార్పులు గోచరించవు. కంటిని ఎవరు దానం చేయవచ్చు? ఏ వ్యక్తి వయస్సు లేదా లింగభేధం లేకుండా కళ్లను దానం చేయవచ్చు. అయితే ఐ బ్యాంకుల వారు కంటి దానాన్ని 2 నుంచి 70 సంవత్సరముల వయస్సు కలిగిన వారి నుండి సేకరిస్తుంటారు. ఇక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్థమా, ట్యూబర్ కులోసిస్ వంటి రుగ్మతలు ఉన్న వారితో పాటూ కంటి అద్దాలను ధరించే వారు, కాటరాక్టు శస్త్ర చికిత్సను చేయించుకొన్న వారు కూడా దానం చేయవచ్చు. ఇక లాసిక్ సర్జరీ చేసిన వారు కూడా దానాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి చేసే దానం ద్వారా నలుగురు అంధులు కంటి చూపును పొందే అవకాశం ఉంది. కంటి దానానికి అనర్హులు ఎవరు? Rabies, Tetanus, AIDS, Jaundice, Cancer, Gangrene, Septicemia, Meningitis, encephalitis, Acute Leukemia, Cholera ల వంటి వ్యాధులతో పాటూ ఫుడ్ ఫాయిజినింగ్ లేదా మునిగిపోవడం ద్వారా చని పోయిన వారు కంటి దానం చేయడానికి అనర్హులు. ఈ విషయాన్ని కంటిని సేకరించే ముందు నిపుణులు బృందం సంబంధిత కుటుంభ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత కంటిని సేకరించడం జరుగుతుంది. కోవడ్ మహమ్మారి సందర్భంగా కంటి దానం చేయవచ్చా? కోవిడ్ మహమ్మారి సమయంలోనూ కంటి దానం చేయవచ్చు. అయితే మహమ్మారి విసిరిన సవాళ్ల నేపధ్యంలో శస్త్ర చికిత్సలు చేయడంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా కంటి దానాలు లేదా కళ్లను సేకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఇలా దేశంలో ఉన్న అందత్వ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కువ సంఖ్యలో దీనిపై అవగాహన కలిగించుకొని కంటి దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్న మూడ నమ్మకాలు, అపోహలు, అడ్డంకిగా ఉన్న ఆచారాలు వంటి వాటిని దాటి సరైన అవగాహనతో కంటిని దానం చేసినట్లైతే ఎందరికో కళ్లను ఇవ్వడానికి దోహదపడవచ్చు. ఇప్పటికే కృత్రిమ కార్నియాపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకూ చూపు కోల్పోతున్న వారికి దానం చేసే కళ్లు మాత్రమే తిరిగి జీవనాన్ని, ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు.... డా. అల్పా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాదు. 24 సంవత్సరముల అనుభవం కలిగిన వైద్యునిగా Cataract, Cornea and Refractive laser surgeries [Like Surface ablation/PRK, LASIK- with or without blade- Femto LASIK, ReLEx SMILE, and Phakic lens (ICL, IPCL, Eyecryl) & Keratoconus solutions] కు సంబందించి
Image
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం