మేకపాటి ఆదేశాలతో విస్తృతంగా సేవలు: వై.సి.పి నాయకులు పల్లాల కొండారెడ్డి

యం.యల్.ఏ మేకపాటి ఆదేశాలతో విస్తృతంగా సేవలు: వై.సి.పి నాయకులు పల్లాల కొండారెడ్డి.


.. వింజమూరు, ఏప్రిల్ 10 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వింజమూరు మండలంలో నిత్యావసర సరుకులు విరివిగా పంపిణీ చేస్తున్నట్లు వింజమూరు మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లాల కొండారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో మన భారతదేశంలో ఈ వైరస్ నివారణ దిశగా ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించి లాక్ డౌన్ ప్రకటించడం జరిగిందన్నారు. లాక్ డౌన్ వలన ఆర్ధిక వ్యవస్థ పతనం అవుతూ, వృద్దిరేటు క్షీణిస్తున్నా మన ప్రభుత్వాలు లెక్కచేయక ప్రజల సం రక్షణే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ నివారణకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారన్నారు. లాక్ డౌన్ వలన ప్రజలందరూ స్వీయ నిర్భంధంలోనే ఉండాలనే స్పష్టమైన ఆం క్షలు, ఆదేశాలు ఉన్నాయన్నారు. కరోనా వైరస్ కట్టడికి అదోక్కటే పరిష్కార మార్గంగా ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయని కొండారెడ్డి అన్నారు. ముఖ్యంగా కూలీల పరిస్థితులు జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా మారాయన్నారు. లాక్ డౌన్ వలన ఏ పనులూ లేక వారు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వీటిని గమనించి యం.యల్.ఏ ఆదేశాల మేరకు లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి ప్రతినిత్యం భోజనాలు అందజేస్తున్నామన్నారు. అంతేగాక లాక్ డౌన్ తో నిత్యావసర వస్తువుల కొనుగోలుకు పరిమితి గడువు ఉన్నందున అందరికీ సరుకుల కొనుగోలుకు సౌలభ్యం గగనంగా మారిందన్నారు. ప్రార్ధించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో మండలంలోని అన్ని గ్రామ పంచాయితీలలో నిత్యావసర వస్తువులైన కూరగాయలు, వంట సరుకులు విరివిగా అందజేస్తున్నామన్నారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు చాకలికొండ, తమిదపాడు, కాటెపల్లి, ఊటుకూరు, గుండెమడగల, నల్లగొండ్ల, చంద్రపడియ, బుక్కాపురం, నేరేడుపల్లి తదితర గ్రామాలతో పాటు పేద వర్గాలు నివసించే కాలనీలలో తమ సేవలను విస్తృతపరుస్తున్నామన్నారు. ఈ కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలందరూ కూడా ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుత తరుణంలో ఎంతైనా ఉందన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, గృహ నిర్భంధంలో ఉండటం, శానిటైజర్లను వినియోగించడం, వ్యక్తిగత పరిశుభ్రతలను పాటించడం లాంటి వాటిని విధిగా అలవరుచుకోవాలని పల్లాల.కొండారెడ్డి విజ్ఞప్తి చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు