పోలీసులు కొట్టారనటం అవాస్తవం.... సత్తెనపల్లి డిఎస్పీ

*పోలీసులు కొట్టారనటం అవాస్తవం.... సత్తెనపల్లి డిఎస్పీ*


గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజక వర్గం క్రోసూరులో   గురువారం రోజు *పోలీసులు దాడిలో ఒక  వ్యక్తి అపస్మారక  స్థితి అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సత్తెనపల్లి డిఎస్పీ తీవ్రంగా ఖండించారు*


గత కొన్నిరోజులుగా క్రోసూరు మండల కేంద్రంలో  పొలాలలో *పేకాటరాయుళ్లు విచ్చలవిడిగా పేకాడుతున్నాట్లు గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారాన్ని ఫోన్ ల ద్వారా, వాట్సప్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్న తరుణంలో* గురువారం రోజు పక్కా సమాచారం అందుకున్న లోకల్ SI ఆనంద్ పొలాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. 


పోలీసుల రాకను గమనించిన పేకాటరాయుళ్లు సుమారు 30 నుండి 40 మంది వరకు తమ స్థావరాల నుండి తప్పించుకోవడానికి *పరుగులు తీశారని* అందులోని వారిని 8 మంది పట్టుకొని అరెస్టు చేయటం జరిగిందని డిఎస్పీ తెలిపారు.


*అక్కడే ఉన్న పేకాట చూస్తున్న పెద్దాయన పరుగు తీయలేక చేలో పడిపోయాడని ఆయన తెలిపారు*


 ప్రాధమిక  విచారణలో ఇతనికి ఆరోగ్యరీత్యా అనారోగ్యంతో బాధపడుతూ గతంలో గుంటూరు రామసుబ్బారెడ్డి వైద్యశాల.  కారుమూరి వైద్యశాలల్లో, నరసరావుపేట GBR వైద్యశాలల్లో,  సత్తెనపల్లి సంజన వైద్యశాల శ్రీధర్ వద్ద పరీక్షలు నిర్వహించుకున్నట్లు తెలిపారు.


ప్రస్తుతం క్రోసూరు నుండి అతన్నీ సత్తెనపల్లి మహేశ్వరెడ్డి వైద్యశాలలో  చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.


ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా ఇతను బ్యాక్ పెయిన్, నరాల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారని డిఎస్పీ వివరించారు.


క్రోసూరు లో అదే ప్రాంతాని చెందిన చర్చి ఫాస్టర్ జేమ్స్ మాట్లాడుతూ గతంలో నేను వైద్యం ఇతనికి వైద్య సహాయం కోసం వైద్యులకు చూపించినట్లు సత్తెనపల్లి వైద్యశాల. వద్ద విలేకరులతో తెలిపారు.


విలేకరుల సమావేశంలో  పట్టణ CI విజయచంద్ర, క్రోసూరు SI ఆనంద్,  క్రోసూరు చర్చి ఫాస్టర్ జేమ్స్ మరియు సిబ్బంది ఉన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు