రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. :పవన్ కళ్యాణ్*

అమరావతి


*పవన్ కళ్యాణ్*


రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.


 ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అన్ని ప్రాంతాల్లో వరి, మొక్క జొన్న, ఉద్యాన పంటలు వేసిన రైతులకు కన్నీరే మిగిలింది. 


రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి పెట్టుబడి రాయితీని అందించాలి. 


ధాన్యం కల్లం మీద ఉంది. అలాగే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కోతలు నడుస్తున్నాయి. వెన్ను విరిగి పంట నీట మునిగిపోయింది.


 ఇలా దెబ్బ తిన్న వరి రైతులకు ప్రభుత్వం తగిన ఉపశమన పథకాలు అమలు చేయాలి.


 రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి.


 ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రావడంతో స్థానిక రైతులకు మద్దతు ధర రావడం లేదు.


 మామిడి రైతుల ఆశలను ఓ వైపు కరోనా దెబ్బ తీస్తే ఇప్పుడు అకాల వర్షాలు మరోసారి దెబ్బ తీశాయి.


 మామిడితోపాటు అరటి, ఇతర పండ్ల తోటల రైతులను, కూరగాయలు సాగు చేస్తున్నవారిని ఆదుకోవాలి.


 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయించారు. 


ఆ మొత్తం నుంచి నిధులు కేటాయించి రైతులను ఆదుకొని నష్టపోకుండా కాపాడాలి.


రైతుల నుంచి వసూలు చేసే నీటి తీరువాను రెట్టింపు చేయాలనే ప్రతిపాదన సరికాదు. 


గిట్టుబాటు ధరలు లేక, మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రైతులు కష్టాల్లో ఉన్నారు


పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాను.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు