రాష్ట్రంలో ద్విభాషా  సూత్రాలను అమలు చేయాల్సిందే -కె.ఎస్.జవహర్

అమరావతి, ఏప్రిల్ 16.(అంతిమ తీర్పు):
ప్రపంచమంతా లాక్ డౌన్ అంటుంటే.. జగన్ ఎన్నికలు ఎన్నికలు అంటున్నారు
ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు మొట్టికాయలేసినా బుద్ది రాలేదా..
రాష్ట్రంలో ద్విభాషా  సూత్రాలను అమలు చేయాల్సిందే
-కె.ఎస్.జవహర్


10 నెలల్లో హైకోర్టుతో 50కి పైగా మొట్టికాయలు వేయించుకున్న ఘనత దేశంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. జగన్మోహన్ రెడ్డి అజ్ఞానపు కూటమిలో తెలివైన వాడు అనుకున్న మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా కొట్టుకుపోతున్నాడు. మిడిమిడి జ్ఞానంతో జగన్ ఆదేశిస్తే.. మంత్రిగా కనీసం ఆలోచించకుండా ముందుకు వెళ్లడం బాధాకరం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని తెలుగుదేశం అడ్డుకుంటోందనడం సిగ్గుచేటు. ఒకసారి రికార్డులు పరిశీలించండి. ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు, అందులో ఆంగ్ల బోధన ప్రవేశపెట్టింది ఎవరో తెలుసుకోండి. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంకు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషి కనిపిస్తుంది. ఆంగ్ల  మాధ్యమాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, పిల్లల కోసమే అని చెబుతూ.. ద్విభాషా సూత్రాలను, 1964 కొఠారి కమిషన్ సూచనలను తుంగలో తొక్కుతున్నారు. లగ్జెంబర్గ్ లో త్రిబాషా సూత్రాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న విషయాన్ని గుర్తించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం  భావ స్వేచ్ఛ, నేర్చుకునే హక్కు విద్యార్ధులదే. ఇంగ్లీష్ మీడియంపై ఇంత హడావుడి చేసిన ప్రభుత్వం ఎంతమంది ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ బోధనలో శిక్షణ ఇప్పించింది.?
స్వామీ వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, సర్వేపల్లి రాధాకృష్ణ, నల్ల సూరీడు నెల్సన్ మండేలా మాతృ భాషతోనే జ్ఞాన సముపార్జన సులభమని, సులభంగా గ్రహించడంతో పాటు భావ వ్యక్తీకరణ కూడా సులభం అవుతుందని చెప్పిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. విద్యా బోధన మాద్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కు ప్రతి విద్యార్ధికీ ఉంది. డిసెంబర్ నాటికి గానీ పుస్తకాలు పంపిణీ చేయలేకపోయారు. మధ్యాహ్న భోజనం అతీగతీ లేకుండా పోతోంది. అలాంటి వీరు కూడా నాడు-నేడు అంటూ హడావుడి చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఇస్తామన్న డీఏ, పీఆర్సీ, సీపీఎస్ రద్దు ఏమయ్యాయి. మీ పది నెలల ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో ఏం ఒరగబెట్టారు.? సదుపాయాల్లేని స్కూళ్లు, గురుకులాలు కనిపించడం లేదా.?
ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు తీర్పును సుప్రాం కోర్టులో సవాల్ చేస్తామంటున్న మంత్రిగారూ... ఏనాడైనా హైకోర్టు సూచనలపై న్యాయ నిపుణులతో చర్చించారా.? కొఠారి కమిషన్ చెప్పిన కామన్ సిలబస్ విధానం గురించి ఎప్పుడైనా ఆలోచించారా.? ముఖ్యమంత్రి, మంత్రులకు హైకోర్టు తీర్పు గురించి కనీసం అవగాహన కూడా లేకపోవడం మన దౌర్భాగ్యం. ఇవేమీ చేయకుండా.. ఒంటెత్తుపోకడలతో విద్యార్ధులను అయోమయానికి గురి చేస్తున్నారు. ఇప్పటికైనా అభ్యాసనా సంసిద్ధత విధానాల గురించి ప్రభుత్వం ఆలోచించాలి.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ గారు రాసిన లేఖ ఫోర్జరీ చేసినదంటూ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. లేఖ ఫోర్జరీ అంటూ.. ఫోర్జరీలు చేసి జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి మాట్లాడడం హాస్యాస్పదం. ఏ 2 రెడ్డి జీవితమంతా ఫోర్జరీలు, మార్ఫింగ్, ఉన్నది లేనట్లు చూపించడం, లేనిది ఉన్నట్లు చూపించడం అని మరిచినట్లున్నారు. నీకున్న అవలక్షణాలు, అవినీతి బురదను దళిత నేత వర్ల రామయ్యకు ఆపాదించడం దుర్మార్గం. విజయసాయి రెడ్డి రాసిన లేఖపై పరువు నష్టం దావా దాఖలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెడతాం. అడవి జంతువులు అడవిలో ఉండాలి. నేరస్తులు జైల్లో ఉండాలని విజయసాయిని చూస్తే అర్ధమవుతోంది. దొంగ సంతకాలు, ఫోర్జరీలు చేసి ఎన్ని కేసుల్లో  ఏ 2గా ఉన్నాడో మరిచిపోయారనుకుంటా. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికే విపత్తుగా మారిన కరోనాను కూడా తన రాజకీయాలకు వాడుకోవాలని చూస్తోంది. ప్రజల ప్రాణాలు పోతున్నా.. కేసుల విషయంలో తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారంతో ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. గుంటూరును రెడ్ జోన్ లో ఉంచేందుకు కేసులు ఎక్కువ చూపిస్తున్నారు. విశాఖకు వెళ్లడమే ధ్యేయంగా కేసులు లేవంటూ తప్పుడు లెక్కలు చెబుతోంది.  దేశమంతా లాక్ డౌన్ కావాలి అంటుంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికలు కావాలంటున్నారు. ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం లేదు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు కరోనాను కట్టడి చేయడం చేతకాక.. చంద్రబాబు గారిపై పడి ఏడుస్తున్నారు. చంద్రబాబు గారి అనుభవాన్ని, సూచనలను దేశమంతా పాటిస్తోంది. కానీ.. జగన్మోహన్ రెడ్డికి పట్టడం లేదు. ఇళ్లు తగలబడుతుంటే.. నుయ్యి  తవ్విన చందంగా కరోనాపై జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా శ్రీనివాసులురెడ్డి* వింజమూరు, ఆగష్టు 22 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి, వింజమూరు మరియు చాకలికొండ పంచాయితీల సమన్వయ సెక్రటరీ బంకా. శ్రీనివాసులురెడ్డి ఎంపికయ్యారు. ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సంధర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారుల పేర్లును జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించడం ఆవవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా ఈ యేడాది శ్రీనివాసులురెడ్డి ఉత్తమ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత 5 సంవత్సరాల క్రితం మండలంలోని చాకలికొండ పంచాయితీ కార్యదర్శిగా నియమింపబడిన బంకా. శ్రీనివాసులురెడ్డి విధి నిర్వహణలో భాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమర్ధవంతమైన పంచాయితీ సెక్రటరీగా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఆయనను వింజమూరు మేజర్ పంచాయితీ ఇంచార్జ్ ఇ.ఓగా కూడా ఉన్నతాధికారులు నియమించడం జరిగింది. చురుకైన స్వభావం కలిగిన శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి గా అదనపు విధులలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలో వింజమూరులో శ్రీనివాసులురెడ్డి సేవలు పతాక శీర్షికలలో నిలిచాయి. పారిశుద్ధ్యం మెరుగుకు పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులను ముందుండి నడిపించారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలలో పగలూ రేయీ అనే తేడా లేకుండా నిరంతర పర్యటనలు చేసి బ్లీచింగ్, హైపోక్లోరెడ్ ద్రావణాలు చల్లించి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసులురెడ్డి ఉత్తమ పంచాయితీ సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు గానూ విధి నిర్వహణలో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, తహసిల్ధారు సుధాకర్ రావు, రక్షణ వలయాధికారి బాజిరెడ్డి తదితర మండల స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు, సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లుకు, జర్నలిస్టులకు, వింజమూరు, చాకలికొండ గ్రామ పంచాయితీల ప్రజలకు ధన్యవాదములు తెలియజేశారు.
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అంధకారమయ ప్రపంచంలో కాంతిని పెంచడానికి మీ కళ్లని దానం చేయడమే ఒక మహోన్నత కార్యం 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించే కంటి దాన వారోత్సవాల సందర్భంగా కళ్ల దానం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూపు మనిషికి దేవుని ద్వారా ప్రధానమైన ఐదు ప్రధానమైన లక్షణాలైన వాసన, తాకడం, వినడం మరియు రుచి లలో ఒకటి. అందులో చూపు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చూపు మానవుని జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున దీనిని పోగొట్టుకోవడం లేదా అంధత్వాన్ని పొందడం మానవుని వ్యక్తిగత జీవన పయనంలోనే కాకుండా అతని కుటుంభలోనూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనిషి ప్రతి రోజూ నిర్వహించే దైనిందిన కార్యక్రమాలైన నడక, చదవగలుగడం, ఇతరులతో మాట్లాడడం, చదువు లేదా ఉద్యోగావకాసాలు దెబ్బతినడం, సమాజిక వ్యవస్థలను వినియోగించుకొనే సామర్థ్యం దెబ్బతినడం లాంటి ఎన్నో ఇబ్బందులను చూపు కోల్పోయిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం కంటిని పరిరక్షించుకోవడం లేదా అవసరమైన చికిత్సను పొందడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ ప్రజలు అంధత్వం లేదా చూపు సరిగ్గా కనిపించకపోవడం వంటి ఇబ్బందులతో భాదపడుతున్నారు. ఇలా భాదపడుతున్న వారిలో 1 బిలియన్ అంటే సగానికి పైగా మనుషులలో ఈ ఇబ్బందిని సరైన చికిత్స అందించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇక కంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారిలో 123.7 మిలియన్ సంఖ్యలో ప్రజలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను సరైన సమయంలో చికిత్స ద్వారా నయం చేయకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారని, 4.2 మిలియన్ మంది కార్నియల్ బ్లైండ్ నెస్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇక 65.3 మిలియన్ ప్రజలు కాటరాక్ట్ కారణాగా 6.9 మిలియన్ ప్రజలు గ్లుకోమా వలన తర్వాత చివరగా 10.4 మిలియన్ సంఖ్యలోని ప్రజలు వయస్సు మీద పడిన కారణంగా తలెత్తే మాక్యులర్ డీజనరేషన్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంఖ్య చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం అంధత్వం బారిన పడుతున్న వారిలో 50 సంవత్సరములకు పైబడిన వారుంటున్నారని అయితే మిగిలిన వయస్కులు కూడా ఈ కోవలో చేరుతున్నారని తెలుస్తుంది. ఇక అంధత్వం లేదా చూపు తగ్గిపోవడం బారిన ఎక్కువగా పేద లేదా అభివృద్ది చెందుతున్న దేశ ప్రజలు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది...ఇందుకు ప్రధానంగా ఆయా దేశాలలో సరైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. ఇక మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని అంధులలో 50 శాతం భారత దేశంలోనే ఉండడం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2020 నాటికి 10.6 మిలియన్ ప్రజలు కార్నియల్ బ్లైండ్ నెస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చూపు కోల్పోతున్న వారిలో 3 మిలియన్ ప్రజలకు కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్త కార్నియా పెట్టడం ద్వారా చూపు తెప్పించవచ్చు. వీరందరికీ కార్నియా అందజేసి చూపు తెప్పించాలంటే ఏటా 1,50,000 కార్నియా ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను ఏటా మన దేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తద్వారా కార్నియల్ బ్లైండ్ నెస్ ను రూపుమాపాలంటే చనిపోయిన వ్యక్తి ద్వారా కళ్లను సేకరించడమే మార్గం. అందుకే ఏటా 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ ఏటా కంటి దానం పై దేశ వ్యాప్తంగా కంటి దాన వారోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కంటి దానంపై అవగాహన కలిపించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కంటి దానానికి సంబంధించిన పలు అంశాలను డా. అల్వా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్, కొండాపూర్ వారి ద్వారా తెలుసుకుందాం.... కంటి దానమంటే ఏమిటి? ఒక వ్యక్తి (పురుషుడు లేదా మహిళ) చనిపోయిన తర్వాత వారి కళ్లను ఇతరులకు అమర్చడానికి వీలుగా దానం చేయడం. కంటి బ్యాంక్ (eye bank) అంటే ఏమిటి? కంటి బ్యాంక్ లేదా ఐ బ్యాంక్ లనేవి లాభాపేక్ష లేకుండా కంటి దానానికి అంగీకరించిన వ్యక్తులు చని పోయిన తర్వాత వారి నుండి కళ్లను సేకరించి, భద్రపరచి, సరైన రీతిలో పరీక్షించి అవసరమైన వారికి అందజేసే వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొదటి సారిగా 1944 లో న్యూయార్క్ నగరంలో డా. టౌన్ లే పాటన్ మరియు డా. జాన్ మెక్లీన్ లు ప్రారంభించారు. భారత దేశంలో 1945 లో ఐ బ్యాంక్ ను డా. RES ముత్తయ్య, దేశంలోనే మొదటి విజయవంతంగా నిర్వహించబడిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యునిచే చెన్నయి లోని రీజనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్తమాలజీ వారు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటి వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు, ప్రజలు దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కలిపిస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఐ బ్యాంకు లు.... 1. రామాయమ్మ అంతర్జాతీయ ఐ బ్యాంక్, యల్ వి ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్, బంజారా హిల్స్ 2. చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు 3. ఐ బ్యాంక్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, హైదరాబాదు 4. మాదవ నేత్ర నిధి, పుష్పగిరి విట్రోరెటీనా ఇన్సిస్టిట్యూట్ 5. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆప్ ఇండియా కార్నియల్ బ్లైండ్ నెస్ లేదా అంధత్వం అంటే ఏమిటి? కార్నియా అనేది కంటిలో అత్యంత బాహ్యమైన లేదా మొదలు భాగంలో ఉండే పారదర్శకత్వంతో కూడిన కంటి భాగం. ఇది రంగులు కలిగి ఉండేలా కనిపిస్తుంది. ఈ కార్నియా వెనుకాల భాగంలో ఐరిస్ అనబడే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ ఉండే రంగును బట్టి కళ్లు బ్రౌన్, బ్లాక్, బ్లూ లేదా గ్రీన్ కలర్స్ లో కనిపించడం జరుగుతుంది. కార్నియా పారదర్శకంగా ఉండి మనం చూసే ఆకృతి యొక్క ప్రతిబింబం ను రెటీనా పై పడేలా చేస్తుంది. ఈ కార్నియా తన పారదర్శకతను కోల్పోతే చూపు తగ్గిపోవడం కాని పూర్తిగా లోపించడం జరుగుతుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్స ఉందా? కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్సగా దెబ్బతిన్న కార్నియా ను తొలగించి ఆరోగ్యమైన కార్నియా తో మార్పిడి చేయడం అంటే పూర్తిగా గాని లేదా పాక్షికంగా కాని చేయాలి. ఈ మార్పిడిని చని పోయిన వారి కళ్ల నుంచి సేకరించిన కార్నియా ద్వారా చేస్తారు. బ్రతికున్న వారు కళ్లను దానం చేయవచ్చా? లేదు. బ్రతికున్న వారు దానం చేయడానికి అనర్హులు. నా కళ్లను నేను ఎలా దానం చేయగలను? ఒకరి కళ్లను దానం చేయడానికి నిర్ణయించుకొన్నపుడు వారు ఐ బ్యాంక్ లను కలిగిన హాస్పిటల్స్ లేదా సంస్థలను సంప్రదించి తత్సంబదిత ధరఖాస్తును నింపాలి. వీటిని ప్రస్థుతం ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. http://ebai.org/donator-registration/ పైన పేర్కొన్న లింక్, ఐ బ్యాంక్ అపోసియేషన్ ఆఫ్ ఇండియా వారిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ముందుగా కుటుంభ సభ్యులకు తెలిపి వారి సమ్మతి తీసుకోవడం అవసరం. దానితో పాటూ ఐ బ్యాంక్ వారి ఫోన్ నెంబర్లను భద్రపరుచుకోవడంతో పాటూ దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులు వెను వెంటనే ఐ బ్యాంక్ వారికి అంటే చనిపోయిన 6 గంటలలోగా తెలయచేయాలి. ఇందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాఆ ప్రాంతంలోని ఐ బ్యాంక్ ను సంప్రదించవచ్చు. చనిపోయిన వ్యక్తి కళ్లను ఐ బ్యాంకు వారు తీసుకొనే వరకూ కంటిపై తడి గుడ్డను ఉంచడం ద్వారా వాటిని కాపాడాలి. ఐ బ్యాంక్ ను ఎలా సంప్రదించాలి? భారత దేశంలో ఐ బ్యాంకును సంప్రదించడానికి ఉన్న కాల్ సెంటర్ నెం. 1919. దీనికి కాల్ చేయడం పూర్తిగా ఉచితం మరియు భారత దేశమంతా 24 గంటలూ అన్ని రోజులు పని చేస్తుంది. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ఐ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు. ఐ బ్యాంకుకు వ్యక్తి మరణ సమాచారం తెలిపినపుడు ఏం జరుగుతుంది? వ్యక్తి మరణించిన వెంటనే ఐ బ్యాంకు కు మీరు కళ్ల దానం చేయాలన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే కంటి వైద్యునితో కూడిన నిపుణుల బృందం వెంటనే మీ ఇంటికి చేరుకుంటుంది. ముందుగా కుటుంభ సభ్యులకు వారు విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి తగిన అనుమతులు తీసుకొన్న తర్వాత చని పోయిన వ్యక్తి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వెంటనే చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు ఎటువంటి అంతరాయం కలుగని రీతిలో 10 నుంచి 15 నిమిషముల వ్యవధిలో ఈ నిపుణుల బృందం కళ్లను సేకరిస్తుంది. పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిపించే రీతిలో ఎవరికీ కనిపించకుండా వీరు తమ పనిని పూర్తి చేస్తారు. పూర్తయిన పిమ్మట మనిషి శరీరంలో ఎటువంటి ఛాయలు లేకుండా పూర్తిగా సాధారణ స్థితిలో కనిపించేలా చేసి పరిసరాలను శుభ్రం చేస్తారు. అంటే అసలు అక్కడ ఇలాంటి పని జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా సరి చేయడం, శుభ్రం చేయడం చేస్తారు. అనంతరం నిపుణులు బృందంలో ఉండే సోషల్ వర్కర్ కుటుంభ సభ్యులకు కళ్ల దానానికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ను అందజేసి సేకరించిన కళ్లను వెంటనే ఐ బ్యాంక్ కు తరలిస్తారు. ఇలా సేకరించిన కళ్లను మూడు నుండి నాలుగు రోజులలోగా ఇతరులకు వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వీటిని ఎక్కువ కాలం కూడా భద్ర పరచడం జరుగుతుంది. ఇక దాత మరియు దానం స్వీకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సాధారంగా కళ్లను ఎవరికి అమర్చారన్న సమాచారాన్ని దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులకు అందజేయరు. కంటిని దానం చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తి కళ్లను తీయడానికి రెండు పద్దతులు ఉపయోగిస్తారు. కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో కొంత రక్తస్రావం జరుగవచ్చు. అయితే అది ఎక్కువగా కాకుండా నిపుణులు శిక్షణ పొంది ఉంటారు. ఇలా కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ షీల్డ్ ను కాని లేదా కాటన్ ప్లగ్ ను పెడుతారు. తద్వారా మనిషి ముఖంలో ఎలాంటి మార్పులు గోచరించవు. కంటిని ఎవరు దానం చేయవచ్చు? ఏ వ్యక్తి వయస్సు లేదా లింగభేధం లేకుండా కళ్లను దానం చేయవచ్చు. అయితే ఐ బ్యాంకుల వారు కంటి దానాన్ని 2 నుంచి 70 సంవత్సరముల వయస్సు కలిగిన వారి నుండి సేకరిస్తుంటారు. ఇక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్థమా, ట్యూబర్ కులోసిస్ వంటి రుగ్మతలు ఉన్న వారితో పాటూ కంటి అద్దాలను ధరించే వారు, కాటరాక్టు శస్త్ర చికిత్సను చేయించుకొన్న వారు కూడా దానం చేయవచ్చు. ఇక లాసిక్ సర్జరీ చేసిన వారు కూడా దానాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి చేసే దానం ద్వారా నలుగురు అంధులు కంటి చూపును పొందే అవకాశం ఉంది. కంటి దానానికి అనర్హులు ఎవరు? Rabies, Tetanus, AIDS, Jaundice, Cancer, Gangrene, Septicemia, Meningitis, encephalitis, Acute Leukemia, Cholera ల వంటి వ్యాధులతో పాటూ ఫుడ్ ఫాయిజినింగ్ లేదా మునిగిపోవడం ద్వారా చని పోయిన వారు కంటి దానం చేయడానికి అనర్హులు. ఈ విషయాన్ని కంటిని సేకరించే ముందు నిపుణులు బృందం సంబంధిత కుటుంభ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత కంటిని సేకరించడం జరుగుతుంది. కోవడ్ మహమ్మారి సందర్భంగా కంటి దానం చేయవచ్చా? కోవిడ్ మహమ్మారి సమయంలోనూ కంటి దానం చేయవచ్చు. అయితే మహమ్మారి విసిరిన సవాళ్ల నేపధ్యంలో శస్త్ర చికిత్సలు చేయడంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా కంటి దానాలు లేదా కళ్లను సేకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఇలా దేశంలో ఉన్న అందత్వ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కువ సంఖ్యలో దీనిపై అవగాహన కలిగించుకొని కంటి దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్న మూడ నమ్మకాలు, అపోహలు, అడ్డంకిగా ఉన్న ఆచారాలు వంటి వాటిని దాటి సరైన అవగాహనతో కంటిని దానం చేసినట్లైతే ఎందరికో కళ్లను ఇవ్వడానికి దోహదపడవచ్చు. ఇప్పటికే కృత్రిమ కార్నియాపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకూ చూపు కోల్పోతున్న వారికి దానం చేసే కళ్లు మాత్రమే తిరిగి జీవనాన్ని, ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు.... డా. అల్పా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాదు. 24 సంవత్సరముల అనుభవం కలిగిన వైద్యునిగా Cataract, Cornea and Refractive laser surgeries [Like Surface ablation/PRK, LASIK- with or without blade- Femto LASIK, ReLEx SMILE, and Phakic lens (ICL, IPCL, Eyecryl) & Keratoconus solutions] కు సంబందించి
Image
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం