విశ్రాంతి ఉద్యోగానికే సేవకు కాదు : సబ్   కలెక్టర్

విశ్రాంతి ఉద్యోగానికే సేవకు కాదు : సబ్   కలెక్టర్
- గూడూరు : విశ్రాంతి ఉద్యోగానికే సేవకు కాదని గూడూరు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు నిరూపించారని గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణకు కరోనా మహమ్మారి కట్టడికి తమ వంతు సాయంగా 25వేల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు సైతం తమ దాతృత్వం చాటుకోవడం స్పూర్తిదాయకం అన్నారు. కరోనా మహమ్మారితో  మానవజాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా వైరస్ కట్టడికి, అభాగ్యులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఇప్పటివరకూ సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ బాష మాట్లాడుతూ తమవంతు బాధ్యతగా సంఘం తరపున 25వేల రూపాయలను సబ్ కలెక్టర్ కి చెక్కు రూపంలో అందించామన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉంటూ వైరస్ కట్టడికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు బీడీ. జయకుమార్, షేక్. బాష, ఏ. భాస్కర్ రావు, జీ. సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు