దాతృత్వం అభినందనీయం - సామాజిక దూరం పాటించాల్సిన  అవసరం ఎంతైనా ఉంది  -   DGP గౌతమ్  సవాంగ్

 తేది : 12.04.2020


 *దాతృత్వం అభినందనీయం - సామాజిక దూరం పాటించాల్సిన  అవసరం ఎంతైనా ఉంది  -  AP DGP గౌతమ్  సవాంగ్ IPS.* 


లాక్‌డౌన్ వేళ అన్ని వర్గాల ప్రజలకు  అండగా ఉండాలనే సదుద్దేశంతో  పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక  నిరతి కలిగిన వ్యక్తులు, దాతలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఫుడ్ ప్యాకెట్లు ఇలా తమకు తోచిన రీతిలో పంపిణీ కార్యక్రమాలు చేయడం అభినందనీయం. వారి దాతృత్వానికి పోలీసు శాఖ శిరస్సు వంచి నమస్కరిస్తోంది.  అయితే అట్టి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో  సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  జనాలు ఒకే చోట గుమికూడ‌టంతో క‌రోనా వైర‌స్ విసృతంగా వ్యాపించే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనమందరం దేనికోసం శ్రమిస్తున్నామో ఆ లాక్ డౌన్ స్ఫూర్తి  దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి.   ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ప్రభుత్వమే మరింత పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి మున్సిపాలిటీ/ కార్పొరేషన్ పరిధిలో వస్తు పంపిణీ చేయదలచిన దాతల దగ్గర నుండి వస్తువులు సేకరించి అట్టి వాటిని సామాజిక దూరం పాటిస్తూ పేదలకు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కావున దాతలు మున్సిపల్ కమీషనర్లను సంప్రదించి అట్టి కార్యక్రమాలు చేబట్టగలరని  మనవి.


 ,
ధ్ర్


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు