వింజమూరులో దాతల సహకారం ప్రశంసనీయం :ఎస్.ఐ బాజిరెడ్డి


వింజమూరు, ఏప్రిల్ 24 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో దాతలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎస్.ఐ బాజిరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో వి.యస్.ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత వనిపెంట.సుబ్బారెడ్డి ప్రభుత్వ శాఖల సిబ్బందికి భోజనాలు అందించే కార్యక్రమానికి ఎస్.ఐ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనిపెంట.సుబ్బారెడ్డి ఇప్పటికే వింజమూరులోని పలు ప్రాంతాలలో పేద ప్రజలకు విరివిగా కూరగాయలను పంపిణీ చేస్తూ తన దాతృత్వమును చాటుకుంటుండటం గొప్ప విషయమన్నారు. తాజాగా ప్రస్తుత కరోనా వైరస్ నియంత్రణ దిశగా పని చేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి వారి వారి కార్యాలయాలకే భోజనాలు చేర్చి అన్నదాతగా కీర్తి గడించారన్నారు. మండల వ్యాప్తంగా దాతలు చేస్తున్న సేవలు మరువరానివన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, రెవిన్యూ తదితర శాఖలతో పాటు జర్నలిస్టులకు సైతం సుబ్బారెడ్డి భోజన ప్యాకెట్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో పంచాయితీ కార్యదర్శి బి.శ్రీనివాసులురెడ్డి, ప్రభుత్వ వైధ్యాధికారి హరిక్రిష్ణ, బి.జె.పి నియోజకవర్గ ఇంచార్జ్ యల్లాల.రఘురామిరెడ్డి, పి.సి.సి సభ్యులు మద్దూరు.రాజగోపాల్ రెడ్డి, వై.సి.పి నేతలు గణపం.రమేష్ రెడ్డి, కైపు.సుబ్బారెడ్డి, నీలం.సంజీవరెడ్డి, ముస్లిం హెల్పింగ్ హ్యాండ్స్ బృందం ప్రతినిధులు ఎస్.కె.రఫి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు