చెంచు గూడాల ప్రజలను  ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి  :  ఐఎచ్ఆర్ఏ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు

చెంచు గూడాల ప్రజలను  ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
   ఐఎచ్ఆర్ఏ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు
గుంటూరు ఏప్రిల్ 25 :రాష్ట్రం లో మానవత్వం మంట కలిసి పోతుందని పేద అణగారిన వర్గాల ప్రజలను ఆదుకొనే నాదుడు కరువైనారని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం (ఐఎచ్ఆర్ఏ)ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు ఆన్ధోలన వ్యక్తం చేశారు.కోవిస్-19, (కరోనా) నేపద్యం లో రాష్ట్రం లో పేదప్రజలు తల్లడిల్లి పోతున్నారని,వారికి సరైన సౌకర్యాలు కల్పించడమ్ లో ప్రభుత్వం విఫలమైందని  ఆయన ఆరోపించారు.రెక్కాడితే గాని డొక్కాడని గుంటూరు జిల్లా వెల్దుర్ది మండలం చెంచు గూడెం  ప్రజలు కరోనా మూలంగా అర్ధకలి తో అలమటిస్తున్నారని తిరుపతి నాయుడు తెలిపారు.ఇలాంటి గూడెంలు,తండాలు రాష్ట్రం లో అనేకం ఉన్నాయని అక్కడి ప్రజల పరిస్తితి కూడా ఇలాగే  ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు.లాక్ డౌన్ నేపద్యం లో ప్రభుత్వం పేద ప్రజల కోసం 1000 రూపాయల నగదు  5 కే.జిల  బియ్యం పంపిణీ చేస్తున్నప్పటికి ఇంతవరకు ఇట్టి పతకం ఈ ప్రాంత ప్రజలకు అందక పోవడం శోచనీయమన్నారు.పాటశాలలు ,హస్తల్స్ మూసివేయడం మూలంగా పిల్లలు ఇళ్ల వద్దే ఉండటం మూలంగా ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం సరిపోవడం లేదని,కనీసం పట్టణాలకు  వెళ్ళి కొందామన్న కరోన మూలంగా వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా వారికి ఒక వైపు ఉపాడి పనులు లేవు,మరోవైపు పొలం పనులు లేకపోవడం తో చేతిలో డబ్బులు లేక అనేకా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. వెంటనే ఈ ప్రాంతాల ప్రజలకు 1000 రూపాయలు, 5 కే.జి ల బియ్యం అందించాలని తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు,ఇట్టి విషయాన్ని అధికారుల  దృస్టికి తెసుకెల్తే వారు కరోనా ఉంది మేము వెళ్లలేము అన్న నిర్లక్ష సమాదానం ఇస్తున్నారని తెలిపారు.పేదల విషయంలో వెంటనే ముఖ్య మంత్రి జగన్ మోహాన్ రెడ్డి స్పందించి వారిని ఆదుకోవాలని తిరుపతి నాయుడు కోరారు.ఈ మేరకు గురజాల ఆర్డిఓ కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు