ముఖ్యమంత్రి కి వచ్చిన విరాళాల వివరాలు

     విజయవాడ, తేదీ.09.(అంతిమ తీర్పు):
ముఖ్యమంత్రి సహాయ నిధి (కోవిడ్-19) కి ఏప్రిల్ 9 వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు 11,839 మంది దాతలు రూ. 133 కోట్ల 6 లక్షల 65  వేల 477 ల విరాళాలు అందజేశారని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఎక్స్- అఫీషియో స్పెషల్ సెక్రటరీ మరియు కోవిడ్-19 రాష్ట్ర టాస్క్ ఫోర్స్ మెంబర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్ల పైబడి 11 మంది దాతలు రూ. 65,37,00,000 లు, విరాళంగా అందించగా, కోటి నుంచి 5 కోట్ల రూపాయల వరకు 23 మంది రూ. 34,87,12,115 లు, 10 లక్షల పైన కోటి రూపాయల లోపు 42 మంది రూ.10,56,91,763 లు, లక్ష పైన 10 లక్షలలోపు 213 మంది రూ. 4,21,71,044 లు, 20 వేల నుండి 50 వేల వరకు 263 మంది రూ. 63,40,958 లు, 20 వేల లోపు 11,160 మంది రూ. 16,74,61,193 ల సాయం అందించారన్నారు.   
కరోనా ఆర్థిక సాయంలో భాగస్వాములు కావాలసిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంధ్రప్రదేశ్ పేరున తమ చెక్కులను పంపాలని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా విరాళాలు అందజేయాలనుకునేవారు SBI ACCOUNT NO - 38588079208, IFSC CODE - SBIN0018884, సెక్రటేరియట్ బ్రాంచ్, వెలగపూడి మరియు ANDHRA BANK ACCOUNT NO : 110310100029039, IFSC CODE – ANDB003079, సెక్రటేరియట్ బ్రాంచ్, వెలగపూడి ఖాతాలలో జమచేయాలన్నారు. వెబ్ సైట్ ద్వారా విరాళాలు అందించాలనుకునే వారు apcmrf.ap.gov.in కు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించాలని ఆయన కోరారు. 
విరాళాలు చెక్కుల రూపంలో మరియు ఆన్ లైన్ లో అందించే దాతలు తమ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈ –మెయిల్ అడ్రస్ తో పాటు ఎందు నిమిత్తం విరాళం అందిస్తున్నారో తెలియజేస్తూ, చెక్కులు ఇతర ఆన్ లైన్ వివరాలను, ప్రత్యేక అధికారి, ముఖ్యమంత్రి కార్యాలయం, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ బ్లాక్, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి,ఈ-మెయిల్: splofficer-cm@ap.gov.in కి అందజేయగలరని ఆయన  తెలియజేశారు. 
వెబ్ సైట్ ద్వారా విరాళాలు ఇచ్చిన దాతలు గౌరవ ముఖ్యమంత్రి లేఖ, రసీదు,100 శాతం ఆదాయ పన్ను మినహాయింపు పత్రాన్ని అదే వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమీషనర్ తెలిపారు. .


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు