ఇర్ఫాన్ ఖాన్ మరణం సినీరంగానికి తీరని లోటు  ఎఫ్.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి


ఇర్ఫాన్ ఖాన్ మరణం సినీరంగానికి తీరని లోటు
 ఎఫ్.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి
 
విజయవాడ, ఏప్రిల్ 29:  బాలీవుడ్ విలక్షణ నటుడైన ఇర్పాన్ ఖాన్ మరణం చలన చిత్ర రంగానికి తీరని లోటని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇర్పాన్ ఖాన్ 1988 లో సలాం బాంబే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి, అనేక చిత్రాల్లో విలక్షణమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల మనన్నలు అతిస్వల్పవ్యవధిలోనే పొందిన గొప్పనటునని ప్రశంసించారు. తెలుగులో నిర్మించిన  సైనికుడు సినిమాలో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకుల మనన్నలు పొందిన విలక్షణ నటుడని, ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమతో ఆయన అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారన్నారు. ఎంతో విలక్షణ నటుడైన ఇర్పాన్ ఖాన్  మృతికి ఎఫ్.డి.సి. ఎం.డి. శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ  సానుభూతి వ్యక్తం చేశారు. 


 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు