పరిస్థితి అర్ధం చేసుకోండి..ఇంట్లో ఉండండి: జర్నలిస్ట్ లకు రాజేష్ బాబు హితవు

అన్నలారా..
తోటి పాత్రికేయ మిత్రులారా...


ఇంత కాలం లేనిది ఇప్పుడు కొత్తగా నోకొవ్చే కిరీటం ఎవరూ పెట్టరు...ముళ్లున్న కరోనా నైతే మాత్రం అంటిస్తారు...నిన్ననే విన్నాం ముంబై, చెన్నై లలో జర్నలిస్టులకు కోవిద్ పాజిటివ్ అని, అంతలోనే మహబూబ్ నగర్ లో మన వాళ్లు ప్రస్తుతానికి క్వరంటైన్ లో వున్నారు.
 ఒక్క సారి ఆలోచించండి...
సరే వృత్తి లో భాగమే కదా భయమెందుకు అని నువ్వనుకున్నా నీకు భరోసా ఎవరు? ఎవరూ లేరు! రారు! 
కనీసం డ్రైవర్లు, క్లీనర్లు, కూలీ బతుకులకున్న విలువ నీకు లేదు...అర్థమౌతుందా??? మిత్రులారా...మనం పరుగెత్తి పరుగెత్తి సేకరించే సమాచారం కావాలని ఎవరూ అడగడం లేదు....ప్రభుత్వం చెప్పే లెక్కే ఫైనల్... తప్పడు వార్త అయితే కేసు, చొచ్చుకుపోతే కరోనా వైరస్సు.


...అవసరమా!!


!ఇంత చెప్పినా వినకపోతే అది ....


నిజంగా ఖర్మే....
ఇంట్లోనే వుండండి...
వార్త అవసమనుకున్న వారు సమాచారం పంపిస్తే రాయండి...


వాళ్లకంటే ముందే మీరెళ్లి, కరోనాకు భారిన పడితే ఏ యాజమాన్యం, ఏ ప్రభుత్వం పట్టించుకోదు..మీకు వచ్చిన కరోన కుటుంబ సభ్యులకు రావడం ఖాయం...పరిస్థితి అర్ధం చేసుకోండి..ఇంట్లో ఉండండి...ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ..ఖచ్చితంగా మా వంతు సహకారం ఉంటుంది


         మీ
రాజేష్ బాబు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు