భువనగిరి నుండి వింజమూరు వరకు వలసవాసులు భోజనాలు ఏర్పాటు చేసిన ఎస్.ఐ...

భువనగిరి నుండి వింజమూరు వరకు వలసవాసులు


భోజనాలు ఏర్పాటు చేసిన ఎస్.ఐ...


వింజమూరు, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని నల్లగొండ్ల గ్రామానికి చెందిన రెండు వలస కుటుంబాలను గుర్తించిన ఎస్.ఐ బాజిరెడ్డి వారికి ముందుగా భోజన ఏర్పాట్లు చేసి తన ఉదారతను చాటుకున్నారు. వివరాలలోకి వెళితే మండలంలోని నల్లగొండ్ల గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు జీవనభృతి కోసం 2 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లాకు కూలి పనుల నిమిత్తం వెళ్ళారు. అయితే కరోనా వైరస్ నేపధ్యంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడ కూలి పనులు లేక వారి పరిస్థితులు దుర్భరంగా మారాయి. గత్యంతరం లేని పరిస్థితులలో వారం రోజుల క్రితం భువనగిరిలో కాలినడకన వింజమూరు మండలంలోని స్వగ్రామమైన నల్లగొండ్లకు బయలుదేరారు. ఈ రోజు మధ్యాహ్నానికి వారు దుత్తలూరుకు చేరుకుంటారన్న ముందస్తు సమాచారంతో వింజమూరు ఎస్.ఐ ఒక ప్రత్యేక వాహనమును ఏర్పాటు చేసి వారిని నేరుగా వింజమూలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి వెంటనే అర్ధాకలితో అలమటిస్తున్న వారికి భోజనాలు అందించారు. తెలంగాణా నుండి వివిద ప్రాంతాల మీదుగా ఈ రెండు కుటుంబాలు కాలినడకన ప్రయాణం చేయడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు