క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన అధికారులు

క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన అధికారులు


వింజమూరు, ఏప్రిల్ 24 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరుకు సమీపంలోని కావలి-కడప మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న కళాశాలను క్వారంటైన్ సెంటరుగా ఉంచేందుకు శుక్రవారం సాయంత్రం మండల కరోనా నియంత్రణ టాస్క్ ఫోర్స్ ముఖ్య సభ్యుల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలలో వసతులు, మరుగుదొడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో క్వారంటైన్ సెంటరుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వింజమూరు మండలంలో ఇప్పటి వరకు ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోగా గ్రీన్ జోన్ గా ప్రకటించి ఉన్నారు. అయినప్పటికీ జిల్లాలో ఈ వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ పరిశీలనలో తహసిల్ధారు సుధాకర్ రావు, వైధ్యాధికారి హరిక్రిష్ణ, ఎస్.ఐ బాజిరెడ్డి, యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి, వి.ఆర్.ఓ వెంగయ్యలు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు