యూనిఫారం పైన హర్జిత్ సింగ్ పేరుతో ఉన్న ఫోటోను షేర్ చేసిన డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ

పంజాబ్ రాష్ట్ర ఏఎస్ఐ హర్జీత్ సింగ్ కి సంఘీ భావంగా, గుంటూరు అర్బన్ పోలీస్ అధికారి డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ  యూనిఫారం పైన హర్జిత్ సింగ్ పేరుతో ఉన్న ఫోటోను షేర్ చేసినారు.
 దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదించిన లాక్ డౌన్ ను ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యగా దేశమంతటా పటిష్టంగా నిర్వహిస్తున్న సందర్భంలో, పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా నగరంలో కూరగాయల మార్కెట్ దగ్గర లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పాస్ లు చూపించాలని అడగటంతో వారు పోలీసులపై దాడికి తెగబడ్డారు. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హర్జీత్‌ సింగ్‌ చేతిని కత్తితో నరికారు.  మరో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ASI ని చండీఘడ్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్ల బృందం చేసిన సర్జరీలో తెగిపోయిన చేతిని డాక్టర్లు తిరిగి అతికించారు. మహమ్మారి ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి సమయంలోనూ పోలీసులు ప్రాణాలకు తెగించి లాక్ డౌన్ విధులు నిర్వ హిస్తున్నారు. మండుటెండుల్లో డ్యూటీలు చేస్తున్నారు. ప్రజలు బయటకు రాకుండా చూస్తూ కరోనా వ్యాప్తిని అడ్డు కోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల పోలీసుల పైన, వైద్యుల పైన, ఇతరుల పైన దాడులు జరుగు తున్నాయి. ఈ సందర్భంగా ఇట్టి చర్యలను ఖండిస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ వారికి సంఘీభావం ప్రకటించడం జరిగింది.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు