గిట్టుబాటు ధరలు కల్పించాలని మార్కెటింగ్ శాఖ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనుసరిస్తోంది

        తిరుపతి ,ఏప్రిల్ 27. (అంతిమ తీర్పు):              ప్రభుత్వం లాక్ డౌన్ లో కొంత సడలింపు ఇవ్వడంతో అందులో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడంతో పలు పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి ఫలితంగా తిరిగి ఉపాధిని కూలీలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం  లాక్ డౌన్ లో సడలింపు కార్యక్రమాలను అను ఈ టీవీ లో ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నడవకపోతే ఆహారోత్పత్తి కి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయని ముందుగానే గ్రహించి అటువంటి పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా నిల్వ ఉంచలేని కూరగాయలకు అదేవిధంగా టమోటా పరిశ్రమలను మామిడి గుజ్జు పరిశ్రమలను తెరిపించారు ఆహార ఉత్పత్తి అయిన పరిశ్రమలు కూడా మినహాయింపు రావడంతో జీడిమామిడి పరిశ్రమలు కూడా ప్రారంభమయ్యాయి చిత్తూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పలుసార్లు రైతులు పలు పరిశ్రమల యజమానులు ఇతర ఆహార ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమల యజమానులతో చర్చలు జరిపారు ఈ చర్చల అనంతరం ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అదేవిధంగా పోలీసుల ఆంక్షలు సైతం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో జిల్లాలో టమోటా గుజ్జు తయారు చేసే పది పరిశ్రమలను తెరిచారు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం 30 శాతం కూలీలను లేదా సిబ్బందిని వినియోగించుకోవాలని అదేవిధంగా భౌతిక దూరం పాటించాలని తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ ఉత్పత్తులను ప్రారంభించుకోవచ్చు నని ఆయన చెప్పడంతో  పరిశ్రమలు ప్రారంభమై టమోటా గుజ్జు లో ముఖ్యంగా రైతుకు కొంతవరకైనా గిట్టుబాటు ధర ప్రస్తుతం లభిస్తోంది ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతులు లేకపోవడంతో చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఈ పంట రెండు ప్రాంతాల రైతులకు అంతో ఇంతో గిట్టుబాటు ధరలు కల్పించాలని మార్కెటింగ్ శాఖ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనుసరిస్తోంది ఒక్కో గుజ్జ పరిశ్రమ రోజుకు 150 టన్నుల క్రషింగ్ ప్రైస్ ది ఉండడంతో సుమారు పదిహేను వందల టన్నుల టమోటా ఫ్యాక్టరీలకు వెళ్తుంది. దీనిద్వారా రైతు పండిస్తున్న టమోటా పంటలో ఎక్కువ భాగం ఈ పరిశ్రమలకు వెళుతుంది దీంతో కొంత వరకైనా గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి ఇక జీడిమామిడి పరిశ్రమకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఉన్న నాలుగు పరిశ్రమలు అందులో ప్రధానంగా తవణంపల్లి మండలం లోని పట్టణం సమీపంలో గల పరిశ్రమలో సుమారు వెయ్యి మంది పనిచేస్తారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ పరిశ్రమలో 300 మందికి అనుమతినిచ్చారు కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం 100 మందితో ఉత్పత్తిని ప్రారంభించింది జనతా కర్ఫ్యూ నాటికి తయారైన ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడంతోపాటు నూతనంగా ఉత్పత్తులు చేసుకునేందుకు అవకాశం ఉందని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని నియమ నిబంధనలను అనుసరిస్తున్నామని వారంటున్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు