ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా కరోనా పరీక్షలు’

‘ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా కరోనా పరీక్షలు’
80,334 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు 
అమరావతి : దేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి అన్నారు. ఎక్కువ పరీక్షలు చేస్తున్నందుకే రాష్ట్రంలో కరోనా పాజిటిక్‌ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80,334 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అందులో 1259 కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. పది లక్షలు జనాభాకు 1504 టెస్ట్‌లు చేస్తూ దేశం లో మొదటి స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పాజిటివ్‌ రేట్‌ తక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రెడ్‌జోన్ల పరిధికి సంబంధించినవేనన్నారు. 1259 కేసుల్లో 809 కేసులు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలోనే నమోదయ్యాయని తెలిపారు. మంగళవారం నమోదైన 82 కేసుల్లో 70 కేసులు ఈ మూడు జిల్లాలోనే నమోదైనట్లు వెల్లడించారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020