‘ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కరోనా పరీక్షలు’
80,334 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు
అమరావతి : దేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ఎక్కువ పరీక్షలు చేస్తున్నందుకే రాష్ట్రంలో కరోనా పాజిటిక్ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80,334 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అందులో 1259 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. పది లక్షలు జనాభాకు 1504 టెస్ట్లు చేస్తూ దేశం లో మొదటి స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పాజిటివ్ రేట్ తక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రెడ్జోన్ల పరిధికి సంబంధించినవేనన్నారు. 1259 కేసుల్లో 809 కేసులు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలోనే నమోదయ్యాయని తెలిపారు. మంగళవారం నమోదైన 82 కేసుల్లో 70 కేసులు ఈ మూడు జిల్లాలోనే నమోదైనట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కరోనా పరీక్షలు’