రంజాన్ నిబంధనలు ప్రకారం జరుపుకొండి: అమలాపురం డీఎస్పీ మాసూమ్ భాషా 

రంజాన్ నిబంధనలు ప్రకారం జరుపుకొండి:డీఎస్పీ మాసూమ్ భాషా 
అమలాపురం :. డీఎస్పీ మాసూమ్ భాషా 
 నిబంధనలకు అనుగుణంగా రంజాన్ నిర్వహించు కోవాలని డీఎస్పీ మాసూమ్ భాషా అన్నారు. 
రాజోలు సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్న  ముస్లిం పెద్దలతో  నగరం  పోలీస్ స్టేషన్ లో  డిఎస్పీ మాసూమ్ భాషా  సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసాన్ని  ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో నిబంధనలు పాటిస్తూ చేసుకోవడం  సమాజం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాసాలు,మరియు నమాజులు చేసుకోవడం మన కర్తవ్యం అని డీఎస్పీ అన్నారు. అదే విధంగా నమాజులు ప్రార్ధనలు అందరూ తమ ఇళ్ళల్లోనే చేసుకోవాలని మీకు ఎటువంటి సమస్య వచ్చిన  పరిష్కరించే దిశలో ప్రభుత్వం ముందుందన్నారు.అదే విధంగా సోషల్ మీడియా లో ముస్లిం లను కించపరిచే విధంగా పోస్ట్ లు "ఫేక్ వీడియో"లు పెట్టే వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలియచేసారు. మే 3 తర్వాత పరిస్థితులను బట్టి ఆంక్షల సడలింపును కమిటీలకు తెలియచేస్తానని తెలిపారు.
మనందరం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నామని అందువలన అందరూ ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరించాలని కోరారు.
. ప్రతి మస్జీద్ లో ఆజాన్ ఇచ్చుటకు మరియు ఉపవాస సైరన్ మ్రోగించుటకు పర్మిషన్ ఇచ్చామన్నారు. 
 ప్రతి మస్జీద్ లో ఇమామ్,మౌజన్ మరియు ఇంకొకరికి మాత్రమే పర్మిషన్ ఇచ్చామని అమలాపురం DSP  మాసూమ్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజోలు CI దుర్గా శేఖర్ రెడ్డి,  నగరం SI సతీష్ పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు