ధరల నియంత్రణ దిశగా తహసీల్ధారు తనిఖీలు

ధరల నియంత్రణ దిశగా తహసీల్ధారు తనిఖీలు వింజమూరు, ఏప్రిల్ 23 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని కిరాణా దుకాణాల వద్ద గురువారం ఉదయం తహసిల్ధారు సుధాకర్ రావు విస్తృతంగా పరిశీలనలు చేశారు. వస్తువుల ధరలు గురించి ఆరా తీశారు. ఎట్టి పరిస్థితులలోనూ వస్తువులకు కృత్రిమ కొరతను సృష్టించడం గానీ, అధిక ధరలకు విక్రయించడం గానీ చేయరాదని దుకాణాదారులకు సూచించారు. లాక్ డౌన్ ప్రకటించిన గత నెల మొదటి రోజు నుండి కూడా తహసీల్ధారు సుధాకర్ రావు ప్రధానంగా నిత్యావసర వస్తువుల వస్తువుల ధరలపై దృష్టి సారించారు. అందులో భాగంగా కూరగాయలు, కిరాణా కొట్లు దుకాణాదారులతో అప్పట్లోనే సమావేశాలు నిర్వహించి దుకాణాల ముందు భాగంలో ధరల పట్టికల బోర్డులను ఏర్పాటు చేయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వస్తువులను వినియోగదారులకు విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసి ఉన్నారు. ఈ నేపధ్యంలో ప్రతిరోజూ ఉదయం తహసిల్ధారు నిత్యావసర సరుకుల దుకాణాలను పరిశీలిస్తూ కొనుగోలు దారులను ధరల విషయమై అడుగుతూ వారి స్పందనను బట్టి ముందుకు సాగుతున్నారు. ఏ మాత్రం కృత్రిమ కొరత సృష్టించినా, ధరలు పెంచినా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తూ ధరల నియంత్రణకు గట్టి చర్యలు చేపడుతున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు