దయచేసి ఎవ్వరూ కూడా అనవసరంగా బయటకు రావద్దు : ఎమ్మెల్యే  విజ్ఞప్తి

దయచేసి ఎవ్వరూ కూడా అనవసరంగా బయటకు రావద్దు : ఎమ్మెల్యే  విజ్ఞప్తి
మంత్రాలయం,ఏప్రిల్, 18 (అంతిమతీర్పు):- మంత్రాలయం నియోజకవర్గం ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా దయచేసి బయటకు రావద్దని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగీరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర సర్కిల్ లో యూపీఎల్ కంపెనీ వారి తరఫున జిల్లా అధ్యక్షులు అశోక్ ఆనంద్ రెడ్డి, మండల ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి ఏర్పాటు చేయించిన ప్రత్యేక మిషన్ ద్వారా పిచికారి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి రోజు, రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చుట్టుప్రక్కల మండల, గ్రామీణ ప్రాంత ప్రజలు  అత్యవసరమైతే తప్పా,ఎవరు కూడా అనవసరంగా  బయటకు రాకూడదనిఅధికారులు సూచించిన ఆదేశాలను తప్పకుండా పాటించాలనివారు కోరారు.అనంతరంరెవెన్యూ,వైద్య,పంచాయతీకార్యదర్శులకి యు పి ఎల్ వారి కంపెనీ తరపున హెల్మెట్ లను అందజేశారు. అనంతరం యూపీఎల్ కంపెనీ వారికి మండల అధికారులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీపురెడ్డి, మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, నాయకులు రాఘవేంద్ర రెడ్డి తహసీల్దార్ చంద్ర శేఖర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుబ్బరాయుడు, ఈవోపీఆర్డి నాగేష్, ఎస్ఐ ఎర్రన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ టి.భీమయ్య, ఎంపిటిసి సభ్యులు రాఘవేంద్ర, వెంకటేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు