ముఖ్యమంత్రికి అవగాహన కల్పించని సలహాదార్లు రాజీనామా చేయాలి:   వర్ల రామయ్య డిమాండ్ 


కరోనాపై ముఖ్యమంత్రికి అవగాహన కల్పించని సలహాదార్లు రాజీనామా చేయాలి:  
: వర్ల రామయ్య డిమాండ్ 
కరోనా వైరస్ తీవ్రతపై సీఎం జగన్ కు అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వ సలహాదార్లు రాజీనామా చేయాలని తెదేపా ప్రధాన కార్యదర్శి  వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ``కరోనా వైరస్ చిన్నపాటి జ్వరం వస్తుంది, పోతుంద’’ని ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంతుంటే సలహాదార్లు ఏ పుట్టలో దాగారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కరోనాపై  అవగాహనా రాహిత్యంతో చేసిన  ప్రకటనతో ప్రపంచమంతా నివ్వెరపోయిందని వర్ల పేర్కొన్నారు. ``కరోనా, మనం కలిసి,మెలిసి జీవించాలి’’అని జగన్ తేలిగ్గా తీసుకుంటే మరి దేశ ప్రధానికి, ఇతర  ముఖ్యమంత్రులకు ఈ విషయాలు తెలియవా? అని నిలదీశారు. కరోనాపై అవగాహనా లేక ముఖ్యమంత్రే స్వయంగా ప్రజలను కంఫ్యూజ్ చేస్తున్నారని విమర్శించారు. కరోనా సాదాసీదా జ్వరంలాంటిదైతే ఇప్పటివరకూ ప్రపంచ దేశాల్లో 2,07,254 మంది ఎందుకు మృత్యువాత పడ్డారో వైకాపా నేతలు సమాధానమివ్వాలన్నారు. కరోనా వ్యాప్తికి తెదేపా స్లీపర్ సెల్స్ కారణమని మంత్రి మోపిదేవి ఆరోపించడం, బయటకు వస్తే కోరంటైన్ కు పంపుతామని డీజీపీ గౌతమ్ సావంగ్ హెచ్చరించడం ఎందుకని నిలదీశారు. ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడినదానికి భిన్నంగా మంత్రి, డీజీపీల ప్రకటనలు ఉండటంతో ప్రజల్లో గందరగోళ స్థితి నెలకొందన్నారు. ప్రపంచ దేశాలను కకావికలం చేస్తున్న  కరోనా వైరస్ తో ``సహజీవనం చేయాలని’’ ముఖ్యమంత్రి జగన్ తేలిగా తీసుకుని మాట్లాడుతుంటే అవగాహన కల్పించలేని సలహాదార్లు  ఏ పుట్టలో దాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కూడా ``మన వారు ‘’ అనే ఆలోచన విడనాడి  ప్రపంచంలో ఏం జరుగుతోందో వాస్తవాలు తెలిసి సలహాలిచ్చే వివేకవంతులను నియమించుకోవాలని సూచించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు