ఈటీవీ విలేకరి మృతికి ఉపరాష్ట్రపతి సంతాపం

ఈటీవీ విలేకరి మృతికి ఉపరాష్ట్రపతి సంతాపం
హైదరాబాద్‌: కుక్కకాటుకి ఈటీవీ పాత్రికేయుడు పూండ్ల శ్రీనివాస్‌(48) మృతిచెందారు. చెన్నై కేంద్రంగా ఈటీవీ ప్రసారాలు మొదలు పెట్టినప్పుడు ‘వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టు’గా చేరిన శ్రీనివాస్‌ ఆ తర్వాత చెన్నై ఈనాడు స్థానిక విలేకరిగా సేవలందించారు. గత పదిహేనేళ్లుగా ఈటీవీ చెన్నై విలేకరిగా పనిచేశారు. మార్చి నెలలో హైదరాబాద్‌కి బదిలీ అయ్యారు. హయత్‌నగర్‌లో నివసిస్తున్న ఆయన.. మార్చి మొదటివారంలో కుక్కకాటుకి గురయ్యారు. గతవారం రేబిస్‌ లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌ నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి 11.30 గంటలకి మృతిచెందారు.
శ్రీనివాస్‌ స్వస్థలం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని అనకర్లపూడి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఆయనకి భార్య, కొడుకు ఉన్నారు. శ్రీనివాస్‌ మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్విటర్‌ ద్వారా విచారం వ్యక్తంచేశారు. ‘వృత్తిపట్ల నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం, విలువలకు కట్టుబడిన వ్యక్తిత్వం ఆయన్ని ఆదర్శపాత్రికేయుడిగా నిలిపాయి. ఆయన వ్యక్తిగతంగా నాతో చాలా అభిమానంగా ఉండేవారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను...!’ అని ట్వీట్‌ చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు