బ్లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా అన్నదాతలు

బ్లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా అన్నదాతలు,


కౌతాళం,ఏప్రిల్,1(అంతిమతీర్పు):-కర్నూలు జిల్లాలోని కౌతాళం,పెద్దకడబూరు, కోసిగి మండలాల్లో కరోనా వైరస్ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ఆయా గ్రామాల్లోని రైతులు చాలా ఇబ్బందులకు  గురవుతున్నారు. పండించిన పంటలు అమ్ముకోవడానికి వీలు లేక పొలాల్లోనే వదిలిపెట్టినమని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామాల్లోని రైతులు పండించిన పంటలైన ఉల్లిగడ్డలు, మిరప, పత్తి, కనకాంబరాలు తదితర పంటలను పంట పొలాల్లోనే  రాసులుగా పోసి కుప్పలు కుప్పలుగా పంట పొలాల్లోనే ఉండడంతో  అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకోకుండా అకాల వర్షాలు వస్తే రైతులు పండించిన పంట అంతా నీటి పాలవడంతో అన్నదాతలు  సర్వనాశనం అవుతారని రైతు కూలీ సంఘం నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆయా మండలాల్లోని  అన్నదాతలు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లాఉపాధ్యక్షులు కె. మల్లయ్య డిమాండ్ చేశారు. కాబట్టి ఆయా సంబంధిత మండలాల్లోని  నాయకులు, ప్రభుత్వఅధికారులువెంటనేస్పందించిజిల్లాఅధికారులతో సంప్రదించికౌతాళంమండలంలోకొనుగోలు చేసే విధంగా  కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు చేసి దీని ద్వారా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకోని ఆయా గ్రామాల్లోని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పొలాల్లో సగానికి సగం మిగిలిపోయిన పనులను రైతులు తమ తమ పొలాల్లో పనులు చేసుకునే విధంగాఅవకాశం కల్పించాలనిరైతుకూలీసంఘంనాయకులు,అన్నదాతలు కోరుతున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు