ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో  పారిశుద్ధ్య కార్మికులకు SS 96 మాస్కులు  పంపిణీ.

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో  పారిశుద్ధ్య కార్మికులకు SS 96 మాస్కులు  పంపిణీ.


    కావలి ఏప్రిల్ 29, (అంతిమ తీర్పు) :  ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో కావలి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు SS 96  మాస్కులను పట్టణ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేసారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకుడు ఏరియా హస్పటల్ కమిటీ మాజీ చైర్మన్ గుత్తికొండ కిషోర్ మాట్లాడుతూ నారా భువనేశ్వరి సౌజన్యంతో రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీలకు ,ఆశా వర్కర్లకు , వైద్య సిబ్బందికి , ANM లకు SS 96 మాస్కులను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో పంపిణీ చేయటం జరుగుతుందని అందులో బాగంగా కావలి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయటం జరిగిందని తెలిపారు. ఈ మాస్కులను కాటన్ క్లాత్ తో వైద్యుల సలహా మేరకు అత్యున్నత ప్రమాణాలతో తయారు చేయటం జరిగింది అని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆద్వర్యంలో నారా భువనేశ్వరి మున్సిపాలిటీ కార్మికులకు 375   SS 96 మాస్కులను అందజేయటం మంచి పరిణామం అని వారిని అభినందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాద్యక్షలు మన్నవ రవిచంద్ర, ఉమెన్ అండ్ వెల్పేర్ రీజనల్ మాజీ చైర్ పర్సన్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, మాజీ కౌన్సిలర్లు కుందుర్తి కిరణ్ ,ఆత్మాకూరు నాగరాజు, సీనియర్ నాయకులు రాజ్ కుమార్ చౌదరి, తటవర్తి వాసు ,మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు