భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కరోనా నివారణకు జాగ్రతలు పాటిద్దాం :మండ్ల సురేష్ బాబు,

మన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కరోనా నివారణకు జాగ్రతలు పాటిద్దాం


*చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైయస్ఆర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు,


*జల వనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ పిలుపుతో శానిటేషన్ కు శ్రీకారం*



*చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న 6 వ రోజు శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోటరి అధ్యక్షులు ధశరద రామిరెడ్డి జన విజాన వేదిక అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద.


*మన భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని కరోనా నివారణకు జాగ్రతలు పాటించి మన జీవితాలను మనమే కాపదుకుంధామని చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వైయస్ అర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు,అధ్యక్షులు గుండాల ఆది నారయణ లు అన్నారు.చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న 7వ రోజు శానిటేషన్ కార్యక్రమాన్ని గురువారం గూడూరు పట్టణం లోని సొసైటీ నారాయణమ్మ దేవస్థానం వద్ద నుంచి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానవత స్వచ్చంధ సంస్థ అధ్యక్షులు,రోటరీ క్లబ్ ప్రతినిధులు దశరథరామిరెడ్డి,జనవిజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా శానిటేషన్ వాహనాన్ని ప్రారంభించారు. చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైయస్ఆర్ కాంగ్రెస్ యువనేత మండ్ల సురేష్ బాబు,జన విజాన వేదిక అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్‍ మాట్లాడుతు చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా శానిటేషన్ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతోందన్నారు.రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పొలుబోయిన అనీల్ కుమార్ యాదవ్,వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఎన్నో విపత్కర పరిస్థితులను భారత దేశ ప్రజలు ఎదుర్కొన్నారన్నారు.దేశంలో కలరా,ప్లేగు,ఇతర ఎన్నో ప్రమాద కర వ్యాధులను తట్టుకుని నిలబదిందన్నారు.కరోనా ను కూడా కలిసికట్టుగా నిలబడి తరిమికొడదమన్నారు.గూడూరులో కరోనా పాజిటివ్ కేసు రావడం దురదృష్టకరమన్నారు.కరోనా దేశంలో చాప కింద నీరులా విస్తరిస్తుంది అని అన్నారు.ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని లేకుంటే కరోనా వైరస్ బారిన పడక తప్పదని అన్నారు.చేగువేరా ఫౌండేషన్ పట్టణ ప్రజలకు అండగా నిలవడం విశేషం అన్నారు.దశరథ రామి రెడ్డి మాట్లాడుతూ కష్ట కాలంలో స్వచ్చంధ సంస్థలు ప్రజలకు అండగా నిలవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్,మధు రెడ్డి,నరేష్  రెడ్డి,అన్సర్ భాష,వినోద్,చేగువేరా పైలట్ టీమ్ పాల్గొన్నారు.*


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు