బి.సి కాలనీ మిత్ర బృందంచే భోజనాల ప్యాకెట్లు పంపిణీ

బి.సి కాలనీ మిత్ర బృందంచే భోజనాల ప్యాకెట్లు పంపిణీ వింజమూరు: ఏప్రిల్ 16 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని బి.సి. కాలనీ మిత్ర బృందం సభ్యులు గురువారం నాడు స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద వున్న సంచార జాతుల కుటుంబాలకు భోజనాల ప్యాకెట్లును పంపిణీ చేశారు. భోజనాల పంపిణీకి ముఖ్య అతిధిగా తహసిల్ధారు యం.వి.కే.సుధాకర్ రావును ఆహ్వానించారు. ఈ సందర్భంగా తహసిల్ధారు మాట్లాడుతూ తమ కార్యాలయంలో కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్న క్రిష్ణ నేతృత్వంలో పలువురు యువకులు బృందంగా ఏర్పడి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం తమకు గర్వ కారణంగా ఉందని కొనియాడారు. కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు మే 3 వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వింజమూరు మండలంలో స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు విరివిగా కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, భోజనాలు పంపిణీ చేస్తూ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల ఆకలి దప్పులు తీర్చుతుండటం అభినందించదగిన విషయమన్నారు. తాజాగా యువకులు కూడా మిత్ర బృందాలుగా ఏర్పడి పేద ప్రజలకు సేవలందించడం ప్రశంసనీయమంటూ, అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలను లాక్ డౌన్ ముగిసే వరకు కొనసాగించాలంటూ దాతలందరికీ విజ్ఞప్తి చేస్తూ వారందరికీ తహసిల్ధారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిత్ర మండలి బృందం సభ్యులు ఇ.వెంకటరమణయ్య, పి.క్రిష్ణ, యం.మహేంద్ర, ఆర్.శ్రీహరి, యం.చిన హజరత్, కె.మహేష్, యం.పెద హజరత్, జి.సుబ్బారావు, పి.రాజశేఖర్, వి.ఆర్.ఏ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు