అలుపెరగని ' జగన్ ' బృందం అన్నదానం

అలుపెరగని ' జగన్ ' బృందం అన్నదానం


వింజమూరు, ఏప్రిల్ 30 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో పోరెడ్డి.జగన్ రెడ్డి బృందం చేస్తున్న అన్నదానం ఆకలి దప్పులతో అలమటిస్తున్న వారికి దేవుడిచ్చిన వరంలా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో నియంత్రణా చర్యలలో భాగంగా ప్రభుత్వాలు నిబంధనలు కఠిమతరం చేసిన విషయం విదితమే. అయితే నిత్యం కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వారు కొంతమేర ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి ప్రతిరోజూ మానవతా దృక్పధంతో భోజనాలు అందిస్తున్నామని పోరెడ్డి.జగన్ రెడ్డి వెల్లడించారు. అంతేగాక ప్రజల సం రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్న పలు శాఖల సిబ్బందికి కూడా భోజనాలు సమకూర్చుతున్నామన్నారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి లు ఆకలితో అలమటిస్తున్న వారికి ఆపన్నహస్తం అందించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. లాక్ డౌన్ ముగిసేవరకూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో బృందం సభ్యులు గూడా.చంద్రారెడ్డి, మెట్టుపల్లి.వెంకారెడ్డిలు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు