దాహార్తి ని తీర్చేందుకు కృషి చేస్తున్న 'పాలకొలను  వరికుంటపాడు 

దాహార్తి ని తీర్చేందుకు కృషి చేస్తున్న 'పాలకొలను 
వరికుంటపాడు ,:
ఎలాంటి లాభాపేక్ష లేకుండా సొంత నిధులతో విరువూరు పంచాయతీ లో దాహార్తి ని తీరుస్తున్న పాలకొలను భాస్కర్ రెడ్డి దాతృత్వం ఇది. వరికుంటపాడు మండలం విరువూరు పంచాయతీ తూర్పు పాలెం కి చెందిన భాస్కర్ రెడ్డి వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో కాంట్రాక్టు పనులు చేసుకుంటున్నారు. తమ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ని గుర్తించిన ఆయన తూర్పు పాలెం లో రెండు బోరులను వేయించాడు. నీరు పడక పోవడం తో నిరాశ చెందకుండా విరువూరు లో ఒక బోరు ని వేయించాడు  అందులో పుష్కలం గా నీరు పడటం తో రెట్టించిన ఉత్సాహం తో ఇదే పంచాయతీ పరిది లోని కోటవర్ధి పల్లి లో మరో బోరు ని వేయించాడు. అందులో కూడా నీరు సమృద్ధి గా రావడం తో ఆ గ్రామ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడుగంటిన భూగర్భ జలాలతో గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న జనం భాస్కర్ రెడ్డి సేవాగుణం వల్ల ఎంతో మేలు జరిగింది అని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు