నిధులను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు- యనమల రామకృష్ణుడు 

అమరావతి, ఏప్రిల్ 22 (అంతిమ తీర్పు ):
యనమల రామకృష్ణుడు విలేకరుల సమావేశం వివరాలు
జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది- అవినీతి, రాజకీయాలకే వైసీపీ ప్రాధాన్యత- నిధులను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు- యనమల రామకృష్ణుడు 
         దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్ని కరోనా తీవ్రతను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా అంటే జగన్ కు మొదటి నుంచి చులకన. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే దుర్బుద్ధితోనే.. కరోనాను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. నేడు కరోనా నియంత్రణ విషయంలో ఏపీ వెనుకబడి ఉంది. పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం లేదు. ర్యాపిట్ కిట్లలో కూడా అవినీతికి పాల్పడే స్థితికి వచ్చారు. అవినీతికి, రాజకీయాలకే ప్రాధాన్యత తప్పితే.. కరోనా నియంత్రణ విషయంలో లేదు. దీనిని ప్రతిఒక్కరు ఖండించాలి. కర్ణాటక, కేరళ కరోనాను సమర్థంగా అరికడుతున్నాయి. కేరళ మొదటి స్థానంలో ఉంది. ఏపీ ఎందుకు అరికట్టలేకపోయిందో మనం ఆలోచన చేసుకోవాలి. జగన్ నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల కోరనా రోజురోజుకూ పెరుగుతోంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. మరోవైపు రాష్ట్ర ఆదాయం కూడా లేదు అనడానికి లేదు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. పెన్షన్లు, జీతాల్లో కోత విధించారు. నిధులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రద్దుల విధానంలోనే జగన్ వెళుతున్నారు. ఇప్పటికీ మేల్కోవడం లేదు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. పంటలను కొనే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఖరీఫ్ కు పెట్టుబడులు పెట్టలేరు. దీంతో ఆహర కొరత కూడా సంభవిస్తుంది. పేదలను ఆదుకునేందుకు ఏ విధమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించలేదు. కరోనా కేసులను దాచిపెడుతున్నారు. ఎన్ని టెస్ట్ లు చేస్తున్నారో చెప్పడం లేదు. ప్రజలకు నిజాలు తెలియనివ్వడం లేదు. ర్యాపిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. అధికార పార్టీకి రాజకీయాలే ముఖ్యమన్న ధోరణిలో ఉన్నారు. వైసీపీ నేతలే కరోనాను వ్యాపింపచేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు