డోర్ టు డోర్  పకడ్బంధీగా  చేపట్టాలి : గుంటూరు జిల్లా కలెక్టర్   ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్

 


గుంటూరు, ఏప్రిల్ 26-2020:- క్లస్టర్ కంటైన్మేంట్ లో కరోనా వైరస్ వ్యాప్తి స్థాయి తెలుసుకునేందుకు ఫీల్డ్ సర్వే లెన్స్ ను  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డోర్ టు డోర్  పకడ్బంధీగా  చేపట్టాలని జిల్లా కలెక్టర్   ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పెర్కొన్నారు.


     ఆదివారం స్థానిక ఆనందపేట, చాకలిగుంటలోని క్లస్టర్ కంటైన్మేంట్ ను జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు డా. కమల్ రాజు తో కలసి పరిశీలించారు. కంటైన్మేంట్ క్లస్టర్లలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు, కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు వున్న వారిని గుర్తించేందుకు క్లస్టర్ కంటైన్మేంట్ లో నియమించిన వైద్య అధికారులు నిర్వహిస్తున్న ఫీల్డ్ సర్వే లెన్స్ జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాల నుండి,  చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చిన తరువాత ఆసుపత్రుల నుండి డిశ్చార్ అయిన వ్యక్తులు, హోం ఐసోలేషన్ లో వుండేలా పర్యవేక్షించాలన్నారు. కంటైన్మేంట్ ప్రాంతాలలో చేస్తున్న శాంపిల్స్ పరీక్షలలో దీర్ఘకాలిక రోగాలు వున్న వృద్దులకు, అనుమానిత వున్న వారికి ప్రాధాన్యతనిచ్చి పరీక్షలు నిర్వహించాలన్నారు. కంట్రోల్ రూముకు మందుల కోసం కాల్ చేస్తున్న వారి పూర్తి వివరాలు, రోగ లక్షణాలు, వినియోగిస్తున్న మందులు గురించి తెలుసుకోవాలన్నారు. వైద్య అధికారులు కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు వున్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే ఫీల్డ్ సర్వే లెన్స్ టీమ్స్ కు సమాచారం అందించి, వారికి శాంపిల్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్లస్టర్ కంటైన్మేంట్ కంట్రోలు రూములలో వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు అవసరమైన ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను సిద్దంగా వుంచుకోవాలన్నారు. 


     అనంతరం  జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు డా. కమల్ రాజు ఆనంద పేటలో రెడ్ క్రాస్ వాలంటీర్ల  ఆధ్వర్యంలో ముస్లీంలు రంజాన్ ప్రత్యేక ప్రార్ధనలు ఇళ్ళలోనే వుండి నిర్వహించుకోవాలని మొబైల్ పబ్లిక్ అడ్రస్ సిస్టం  ద్వారా నిర్వహిస్తున్న ప్రచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు ఇళ్లలోనే వుండి ప్రార్ధనలు నిర్వహించుకోవాలన్నారు.  ప్రతి వ్యక్తి  ఆరోగ్యపరమైన డేటాను అప్ లోడ్ చేసేందుకు మాత్రమే ఆధార్ కార్డు నంబర్లు అడుగుతున్నామని, ప్రజలందరూ ఆధార కార్డు నంబర్లు తెలిపి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.  


     కార్యక్రమంలో గుంటూరు అర్బన్ ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ, సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్,  తెనాలి సబ్ కలెక్టర్ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారాపు రెడ్డి, నగరపాలక సంస్థ  కమీషనర్ చల్లా అనురాధ, వైద్య ఆరోగ్య, రెవిన్యూ, మునిసిపల్ శాఖ ఆధికారులు  తదితరులు పాల్గొన్నారు.
శాా


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు