కూలీలను తరలిస్తున్న ఆటో డ్రైవర్లపై కేసు నమోదు

కూలీలను తరలిస్తున్న ఆటో డ్రైవర్లపై కేసు నమోదు


వింజమూరు, ఏప్రిల్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో శనివారం ఉదయం అధిక సంఖ్యలో కూలీలను పనులకు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్.ఐ బాజిరెడ్డి అరెస్ట్ చేయడంతో పాటు ఆటోను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరణ నేపధ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వైరస్ నియంత్రించబడే వరకు ప్రజలు స్వీయ నిర్భందంలోనే ఉండాలని, సమదూరం పాటించాలనే స్పష్టమైన ఆదేశాలున్నాయన్నారు. వింజమూరు మండలం గ్రీన్ జోన్ అంటే పూర్తిగా సడలిపులు ఇచ్చిన విధంగా ప్రజలు భావించడం సరికాదన్నారు. కూలీ పనులకు వెళ్ళే వారు సమదూరం పాటిస్తూ అతికొద్ది మంది మాత్రమే వెళ్ళాలన్నారు. ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు నడుచుకోవాలన్నారు. ముఖ్యంగా ఆటోవాలాలు ఈ విషయాలను గమనించాలన్నారు. గుంపులు గుంపులుగా కూలీలను తరలిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్.ఐ స్పష్టం చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు