నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు: వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి

నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు: వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి


.వింజమూరు, ఏప్రిల్ 13 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) లాక్ డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమని వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నాడు వింజమూరులోని బంగ్లాసెంటర్ వద్ద విచ్చలవిడిగా తిరుగుతున్న పలు ద్విచక్ర వాహనదారులను నిలువరించి అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రించేందుకే ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి కొద్ది రోజుల పాటు ప్రజలను స్వీయ నిర్భంధంలో ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జన సమూహాలు లేకుండా ఉంటేనే ఈ వైరస్ ను నియంత్రించవచ్చునని ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశ్యమన్నారు. కానీ కొంతమంది ఏ పనీ పాటా లేకుండా ఏదో ఒక వంకతో రోడ్లు మీదకు వస్తున్నారని, ఇది క్షేమకరం కాదని ఆయన హితువు పలికారు. ఈ సందర్భంగా కొంతమంది ఆసుపత్రులకు వెళుతున్నామని, బ్యాంకులకు వెళుతున్నామని తెలియపరచగా పూర్తి వివరాలు సేకరించిన అనంతరం ద్విచక్ర వాహనాలపై ఒక్కొక్కరు మాత్రమే ప్రయాణం చేయాలని సూచించారు. తమకు పలుకుబడి ఉందిలే, తమకేమవుతుందిలే అని నేరుగా వచ్చిన కొంతమంది పోలీసుల ముందు అభాసుపాలు కాక తప్పలేదు. ఎస్.ఐ వారిని వాహనాల పక్కన నిలబెట్టి చరవాణి ద్వారా కేసులు నమోదు చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు