తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది - ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పేద,బడుగు,బలహీన  వర్గాలకు ఎప్పుడు ఏ కష్టం  వచ్చిన  తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎమ్మెల్సీ *యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్* మాజీ ఎమ్మెల్యే *బోడే ప్రసాద్*


పెనమలూరు నియోజకవర్గం ఉయ్యురు మండలం కాటూరు గ్రామంలో మండల తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు దండమూడి పూజిత పర్యవేక్షణలో 1600 కుటుంబాలకు ఇంటింటికి పలు రకాల కూరగాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్* మాజీ ఎమ్మెల్యే *బోడే ప్రసాద్* గార్లు 


ఈ సందర్భంగా *రాజేంద్ర ప్రసాద్* గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని,లాక్ డౌన్ వలన ఇల్లు గడవక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటామని, ప్రతిపక్షంలో వున్నా కూడా  ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటు మీ కష్టాలు మా కష్టాలుగా భావిస్తామని *రాజేంద్ర ప్రసాద్* గారు అన్నారు.


మాజీ ఎమ్మెల్యే *బోడే ప్రసాద్* గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి పేదల జీవితాల్లో చీకటి నింపుతుంది అని, జీవన ఉపాధి లేక చాలా కుటుంబాలు పస్తులు వుంటున్నారని వారందరికీ మేము మన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటామని అయన అన్నారు. 


ఈ సందర్బంగా ఇంటింటికి కూరగాయలు పంచుతూ మంచి సేవా కార్యక్రమం చేస్తున్న దండమూడి చౌదరి, పూజిత లను *రాజేంద్ర ప్రసాద్* గారు *బోడే ప్రసాద్* గారు అభినందించారు. 


ఈ కార్యక్రమంలో ఉయ్యురు మండల పార్టీ అధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు, కాటూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకట నారాయణ, బాబూ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు