జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలకు డిమాండ్

*కరోనా వైరస్ పోరాటంలో వైద్యులు, పోలిసులు, పారిశుధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు. పలు చోట్లల్లో జర్నలిస్టులు సైతం కరోనా బారినా పడ్డారు . అయితే ధైర్యంగా విధులు నిర్వర్తిస్తోన్న జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటను విడుదల చేశారు పవన్ కళ్యాణ్..


"కరోనా విపత్తులోనూ తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు చాలా ధైర్యంగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. తెలంగాణాల్లో కన్ని చోట్ల జర్నలిస్టులు కూడా క్వారంటైన్‌ కు వెళ్ళినట్లు తెలిసింది. పాత్రికయులు తమ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ విధులు చేపట్టాలి. పొరుగున ఉన్న తమిళనాడులో 25 మంది, ముంబయిలో 50మందికిపైగా జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌ అని తేలిన నేపథ్యంలో పాత్రికేయులకు అవసరమైన ఆరోగ్య భద్రత, బీమాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. జర్నలిస్ట్‌ సంఘాలు, మీడియా సంస్థలు జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను." అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు