కర్నూలు మెడికల్ కాలేజీ మైక్రోబయాలజి విభాగంలో ఏర్పాటు చేసిన వి.ఆర్.డి.ఎల్. కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్  తనిఖీ

 23-4-2020 -- 


*కర్నూలు జిజిహెచ్ ను స్టేట్ కోవిడ్ ఆస్పత్రి గా ప్రభుత్వం  ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం కర్నూలు జిజిహెచ్ ఆస్పత్రి ఆవరణంలో ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి లో ఏర్పాటు చేసిన  కొత్త ఓపి (ట్రాయాజ్) ఏర్పాట్లను, కర్నూలు మెడికల్ కాలేజీ మైక్రోబయాలజి విభాగంలో ఏర్పాటు చేసిన వి.ఆర్.డి.ఎల్. కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ను  తనిఖీ చేసిన ఉప ముఖ్యమంత్రి & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం*


*మంత్రుల వెంట ఉండి వివరాలను వివరించిన కోవిడ్  స్టేట్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జేసీ రవి పట్టన్ షెట్టి, జిజిహెచ్ సూపరి0టెండెంట్ డా.రాంప్రసాద్, కెఎంసి వైస్ ప్రిన్సిపల్ డా.ప్రభాకర్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ డా.రామ గిడ్డయ్య  తదితరులు*


*అనంతరం, జిజిహెచ్ న్యూ లెక్చర్స్ గ్యాలరీ హాల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, కోవిడ్ నోడల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిజిహెచ్, కె ఎం సి డాక్టర్లు, వివిధ వైద్య విభాగాల హెడ్స్ తో కోవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష చేస్తున్న ఉప ముఖ్యమంత్రి & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం తదితరులు* 


*కర్నూలు లో సమీక్ష అనంతరం, ఈ మద్యాహ్నం నంద్యాల శాంతిరామ్ ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిని తనిఖీ చేసి, అధికారులు, ప్రజా ప్రతినిధులతో నంద్యాల మునిసిపల్ ఆఫీసు లో కరోనా కట్టడి చర్యలపై సమీక్ష చేయనున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, జిల్లా మంత్రులు*
-


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు