లాక్‌డౌన్‌ పొడిగించండి: వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీని కోరిన సీఎంలు

లాక్‌డౌన్‌ పొడిగించండి: వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీని కోరిన సీఎంలు



   న్యూ ఢిల్లీ ;    కొవిడ్-19 వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలుపై చర్చ ఆంక్షల సడలింపు లేక కొనసాగింపుపై సలహాలు తీసుకుంటున్న మోదీ
ఎఫ్ఆర్‌బీఎం పరిమితి, ఆర్థిక సాయంపై చర్చ
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మాట్లాడుతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కొవిడ్-19 వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలు, ఇప్పటివరకు విధించిన ఆంక్షల సడలింపు లేక కొనసాగింపు వంటి అంశాలపై కీలక చర్చలు జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేసే విషయంపై కూడా చర్చిస్తున్నారు.  


మే 3 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ఈ సందర్భంగా మోదీని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు. అలాగే, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి, ఆర్థిక సాయం వంటి అంశాలను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తావించారు. దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తేయాలని ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు