ఊటుకూరులో టి.డి.పి నేతలచే నిత్యావసరాలు పంపిణీ

ఊటుకూరులో టి.డి.పి నేతలచే నిత్యావసరాలు పంపిణీ


వింజమూరు, ఏప్రిల్ 13 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ఊటుకూరు ఎస్.సి, ఎస్.టి కాలనీలో నివసిస్తున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నేత వరికూటి.మాల్యాద్రిరెడ్డి నేతృత్వంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వింజమూరు మాజీ సొసైటీ అధ్యక్షులు గొంగటి.రఘునాధరెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు చూపుతో వ్యవహరించి జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ లు విధించి ఈ వైరస్ ముమ్మరం కాకుండా అడ్డుకట్ట వేయడం అభినంచదగిన విషయమన్నారు. లాక్ డౌన్ వలన కూలీ పనులు వెళ్ళే వెసులుబాటు మృగ్యం కావడంతో వారి కుటుంబాల పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. కనుక వారందరికీ చేయూతనిచ్చేందుకు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని.వెంకటరామారావు పిలుపు మేరకు పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ యన్నం.రామచంద్రారెడ్డి, ఊటుకూరు టి.డి.పి యం.పి.టి.సి అభ్యర్ధి అంకి.పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020