గుంటూరు పారిశుద్ధ్య కార్మికులకు లక్ష రూపాయల విరాళం. 

గుంటూరు పారిశుద్ధ్య కార్మికులకు లక్ష రూపాయల విరాళం


   గుంటూరు, ఏప్రిల్ 16,(అంతిమ తీర్పు) :    బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ గుంటూరు నగరంలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం లక్ష రూపాయల విరాళంను చెక్కు రూపంలో ఈ నెల 16వ తేదీన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అనురాధ ను కలసి 
మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి నేతృత్వంలో బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి పౌండేషన్ ప్రతినిధి పెండేల ప్రసాదు అందించారు. ఈ సందర్భంగా వల్లo రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ గుంటూరు నగరంలో ప్రతి ఆపద సమయంలో డాక్టర్ బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి ఆదుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు లక్షల రూపాయలను, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు రెండు లక్షల రూపాయలను అందించారన్నారు. లాక్ డౌన్ ను  సక్రమంగా అమలు చేయటానికి గుంటూరు నగరంలో కమిషనర్ అనురాధ అవిరళ  కృషి చేస్తుందని అభినందించారు. గుంటూరు నగరంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకుయజమానులందరూ వేతనాలు చెల్లించాలని విన్నవించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ ప్రతి ఒక్కరు వారికి తోడ్పాటునoదించాలని విజ్ఞప్తి చేశారు. 


      


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు