గుంటూరు నగర విలేఖరులకు నిత్యావసరాల పంపిణీ - మద్య విమోచన ప్రచార కమిటీ.

 


 గుంటూరు నగర విలేఖరులకు నిత్యావసరాల పంపిణీ - మద్య విమోచన ప్రచార కమిటీ.
 
  గుంటూరు ,ఏప్రిల్ 24 (అంతిమ తీర్పు) :  నగరంలోని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన 120 మంది విలేఖరులకు పది కేజీల బియ్యం తో పాటు 1.50 లక్షల రూపాయల విలువైన నిత్యావసరాలను మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ఈనెల 24వ తేదీన పంపిణీ చేశారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ విభాగ అధికార యంత్రాంగం, ఆళ్ల శివారెడ్డి,  వీరారెడ్డి, సి.హెచ్. చక్రపాణి,  పి. పోతురాజు, కన్నా మాస్టర్, చలపతి విద్యాసంస్థల అధినేత వీరాంజనేయులు సహకారంతో మీడియా మిత్రులకు నిత్యావసరాలను వారివారి ఆఫీసులకు స్వయంగా వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం  రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ కరోనా విపత్తును ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయడంలో మీడియా ప్రధాన భూమిక వహిస్తుంది. కరోనా  నేపథ్యంలో మీడియా మిత్రుల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.ఈ  పంపిణీ కార్యక్రమంలో పి.రత్న రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు