లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ

లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ


ఎమ్మిగనూరు,టౌన్,ఏప్రిల్ 14 (అంతిమతీర్పు):-మన దేశ ప్రజల ప్రాణాలను  కబలిస్తున్న కరోన వైరస్ ధాటికి పట్టణ,గ్రామీణ ప్రాంత ప్రజలు అడుగు బయట పెట్టలేని తరుణంలో స్థానిక హెచ్ బి ఎస్  కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకునిఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి  మాజీ ఎమ్మెల్యే బివి. జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు  తెదేపా పట్టణ యువ నాయకులు  దయాసాగర్ 21వ వార్డులోని పిరమిడ్,పెద్దాసుపత్రి,గీతమందిరం, ఆడివప్పమఠం దగ్గర తదితర ప్రాంతాల్లో నివసించే నిరుపేద కుటుంబాలు అయినా  చెయ్యి ఆడితే గానీ డొక్కాడని పరిస్థితి గల నిరుపేద కుటుంబాలు గల సుమారు 250 కుటుంబాల వారికి  కావాల్సిన బియ్యం,బ్యాళ్లు, కారం,గోధుమపిండి, ఉప్మారవ్వ,సన్ ఫ్లవర్ ఆయిల్,2 dettol సబ్బులు  పంపిణీ చేయడం జరిగిందని టిడిపి యువ నాయకులు దయాసాగర్ తెలిపారు.ఈ సందర్భంగా వారికి కాలనీవాసులు హృదయ పూర్వక ధన్యవాదాలుతెలుపుతూ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాబట్టి ఇలాంటి సమయంలో మీ సేవలు మాకు ఎంతో అవసరమని ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నెన్నో చేయాలని కాలనీవాసులు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్, రవి,విజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు