క్షురకుల జీవితాలు క్షవరం  

క్షురకుల జీవితాలు క్షవరం                    
 


అంతిమ తీర్పు,ఏప్రిల్ 20, శ్రీకాళహస్తి.                                                                                       వేదం .... నాదం అంటారు పెద్దలు. సర్వలోకాలను పాలించి, మేల్కొపే భగవంతుడిని సైతం వేదమంత్రాలతో బ్రాహ్మణులు, మంగళ నాద వాయిద్యాలతో నాయీ బ్రాహ్మణులు మేల్కొపుతారు. నాయీ బ్రాహ్మణులను వ్యవహారికంగా మంగళ్ళుగా పిలుస్తుంటారు. మంగళ్ళు అంటే మంగళకరులు, శుభకరులు అని అర్థం. అలాంటి నాయీ బ్రాహ్మణుల జీవితాలు  కోవిద్-19 @ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మంగళకరమైన రోజులు కనుమరుగయ్యాయనే చెప్పాలి. నాయీ బ్రాహ్మణుల ప్రధాన వృత్తి క్షవరం చేయడం, మంగళ వాయిద్యాలు మ్రోగించడం. ప్రాచీనకాలం నుండి నాయీ బ్రాహ్మణులు సామాజిక వైద్యులుగా కూడా పేరుగాంచారు. అలాంటి నాయీ బ్రాహ్మణులు వృత్తిలో భాగంగా తల వెంట్రుకలు కత్తిరించడం, తైల మర్దనం చేయడం వలన వ్యక్తులకు అత్యంత సమీపంలో పనిచేస్తుంటారు. అందువలన కరోనా వాహకులుగా మారే ప్రమాదం ఉందని క్షౌరశాలలకు లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇవ్వలేదు. క్షౌరశాలలు మూతపడిన నేపధ్యంలో పనిలేక వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. క్షౌర వృత్తిదారులు అందరూ దాదాపు దారిద్ర్యరేఖ దిగువకు చెందినవారే. క్షౌరశాలల అద్దెలు, ఉపకరణాల కొనుగోలు కోసం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులలో ఋణాలు తీసుకుని నిర్వహిస్తుంటారు. అనేక  సందర్భాలలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల వద్ద రోజువారీ సర్దుబాటు ఋణాలు కూడా అధిక వడ్డీలకు తీసుకుని కుటుంబ అవసరాలు తీర్చుకొంటుంటారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చేసిన అప్పులు తీర్చలేక, రోజువారీ కుటుంబ అవసరాలు తీర్చలేక నానావస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాయీ బ్రాహ్మణుల కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేందుకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్షౌరశాలలు తెరిచే వరకు నెలకు పదివేల రూపాయలు వంతున ప్రభుత్వం  తాత్కాలిక భృతి అందించాలని నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్  కోరారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు