*23–04–2020*
*అమరావతి*
*వ్యవసాయ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్పై సీఎం వైయస్.జగన్ సమీక్షా సమావేశం.
*రైతులను ఆదుకునే వినూత్న విధానాలపై చర్చ*
*కోల్డ్స్టోరేజీలు, గోదాముల్లో స్వయం సమృద్ధి దిశగా అడుగులు
*అమరావతి: వ్యవసాయ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్పై అధికారులతో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్షా సమావేశం*
రైతుల్ని ఆదుకునే వినూత్న వ్యవస్థల కార్యాచరణ ప్రణాళికపై చర్చ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేయాల్సిన పనులపై అధికారులకు లక్ష్యాలు నిర్దేశించిన ముఖ్యమంత్రి
కోవిడ్ –19 కారణంగా ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని మార్కెట్లను వికేంద్రీకరించాం: సీఎం
వీటిని పూర్తిస్థాయిలో మ్యాపింగ్ చేసి.. భవిష్యత్తులోకూడా వాటిని నిర్వహించేలా చూడాలి: సీఎం
అలాగే ప్రస్తుతం గుర్తించిన దుకాణాలకు భవిష్యత్తులోకూడా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు పంపిణీ చేస్తే.. దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది: సీఎం
రైతుల ఉత్పత్తులను ప్రజల ముంగిటకే తీసుకెళ్లడానికి కూడా ఈవిధానం బాగా ఉపయోగపడుతుంది:
ఎక్కడైనా రైతు పండించిన పంటకు సరైన ధర లభించలేదంటే.. మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా కచ్చితంగా అలర్ట్ రావాలి:
అలా అలర్ట్ వచ్చే పరిస్థితి వెబ్సైట్లో ఉండాలి:
ప్రతిరోజూ అగ్రికల్చర్ అసిస్టెంట్లు నిరంతరం తమ గ్రామంలోని పంటలు, ఉత్పత్తులు, వాటి ధరలపై సమాచారాన్ని తమకు ఇచ్చిన ట్యాబు ద్వారా నిరంతరం యాప్లో అప్లోడ్ చేయాలి:
ప్రతి రైతు భరోసా కేంద్రంలో కంటైనర్ వాహనాన్ని ఉంచడంద్వారా రైతుల ఉత్పత్తులను తరలించడానికి ఉపయోగపడుతుంది:
అలాగే ఏర్పాటు చేయదలుచుకున్న జనతా బజార్లకు కావాల్సిన నిత్యావసరాలు, వస్తువులను తీసుకురావడానికీ ఉపయోగపడుతుంది:
రైతులనుంచి సేకరించిన ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్దే
గ్రేడింగ్, ప్యాకేజీ చేసి.. ఇతర మార్కెటింగ్ వ్యవస్థల్లోకి, అలాగే జనతా బజార్లకూ తరలించవచ్చు:
ఈ వ్యవస్థలన్నీకూడా సక్రమంగా నడపడానికి నిర్దిష్టమైన ఎస్ఓపీలను రూపొందించుకోవాలి:
అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి సమాచారం రాగానే 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి:
దీనికి సంబంధించి ప్రోటోకాల్ తయారుచేసుకోవాలి:
వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు జూన్ 1 నాటికి ప్రారంభం కావాలి:
అప్పటికి ఈ వ్యవస్థకూడా సజావుగా నడిచేలా చూడాలి:
జనతాబజార్లు, గ్రామ స్థాయిలో కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, కంటైనర్ వాహనం, ఆర్బీకేలు, మార్కెటింగ్యార్డుల్లో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు, కోల్డ్స్టోరేజీలు, గోదాములు, ఆక్వాప్రాంతాల్లో ఇండివిడ్యువల్
క్విక్ ఫ్రీజింగ్ సదుపాయాలు ఏర్పాటు కావాలి:
ఇవన్నీ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దృష్టిపెట్టాల్సిన అంశాలని స్పష్టంచేసిన సీఎం:
రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్స్టోరేజీలు, గోదాముల అంశంలో స్వయం సమృద్ధి సాధించాలి:
నిధులు ఎంతైనా ఒకసారి పెట్టి... వ్యవసాయరంగాన్ని పట్టాలమీదకు తీసుకు వచ్చే ప్రయత్నంచేద్దాం:
దీంతోపాటు ధరల స్థిరీకరణ నిధి రైతులకు అండగా నిలబడుతుంది: