వ్యవసాయ మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై సీఎం  వైయస్‌.జగన్ సమీక్షా

*23–04–2020*
*అమరావతి*


*వ్యవసాయ మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై సీఎం  వైయస్‌.జగన్ సమీక్షా సమావేశం.
*రైతులను ఆదుకునే వినూత్న విధానాలపై చర్చ*


*కోల్డ్‌స్టోరేజీలు, గోదాముల్లో స్వయం సమృద్ధి దిశగా అడుగులు


*అమరావతి: వ్యవసాయ మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై అధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్షా సమావేశం*
రైతుల్ని ఆదుకునే వినూత్న వ్యవస్థల కార్యాచరణ ప్రణాళికపై చర్చ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేయాల్సిన పనులపై అధికారులకు లక్ష్యాలు నిర్దేశించిన ముఖ్యమంత్రి


కోవిడ్‌ –19 కారణంగా ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని మార్కెట్లను వికేంద్రీకరించాం: సీఎం
వీటిని పూర్తిస్థాయిలో మ్యాపింగ్‌ చేసి.. భవిష్యత్తులోకూడా వాటిని నిర్వహించేలా చూడాలి: సీఎం
అలాగే ప్రస్తుతం గుర్తించిన దుకాణాలకు భవిష్యత్తులోకూడా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు పంపిణీ చేస్తే.. దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది: సీఎం
రైతుల ఉత్పత్తులను ప్రజల ముంగిటకే తీసుకెళ్లడానికి కూడా ఈవిధానం బాగా ఉపయోగపడుతుంది:
ఎక్కడైనా రైతు పండించిన పంటకు సరైన ధర లభించలేదంటే.. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా కచ్చితంగా అలర్ట్‌ రావాలి:
అలా అలర్ట్‌ వచ్చే పరిస్థితి వెబ్‌సైట్లో ఉండాలి:
ప్రతిరోజూ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు నిరంతరం తమ గ్రామంలోని పంటలు, ఉత్పత్తులు, వాటి ధరలపై సమాచారాన్ని తమకు ఇచ్చిన ట్యాబు ద్వారా నిరంతరం యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి:
ప్రతి రైతు భరోసా కేంద్రంలో కంటైనర్‌ వాహనాన్ని ఉంచడంద్వారా రైతుల ఉత్పత్తులను తరలించడానికి ఉపయోగపడుతుంది:
అలాగే ఏర్పాటు చేయదలుచుకున్న జనతా బజార్లకు కావాల్సిన నిత్యావసరాలు, వస్తువులను తీసుకురావడానికీ ఉపయోగపడుతుంది:
రైతులనుంచి సేకరించిన ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్‌ యార్డుల వద్దే 
గ్రేడింగ్, ప్యాకేజీ చేసి..  ఇతర మార్కెటింగ్‌ వ్యవస్థల్లోకి, అలాగే జనతా బజార్లకూ తరలించవచ్చు:
ఈ వ్యవస్థలన్నీకూడా సక్రమంగా నడపడానికి నిర్దిష్టమైన ఎస్‌ఓపీలను రూపొందించుకోవాలి:
అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి సమాచారం రాగానే 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి:
దీనికి సంబంధించి ప్రోటోకాల్‌ తయారుచేసుకోవాలి:
వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు జూన్‌ 1 నాటికి ప్రారంభం కావాలి:
అప్పటికి ఈ వ్యవస్థకూడా సజావుగా నడిచేలా చూడాలి:


జనతాబజార్లు, గ్రామ స్థాయిలో కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, కంటైనర్‌ వాహనం, ఆర్బీకేలు, మార్కెటింగ్‌యార్డుల్లో గ్రేడింగ్, ప్యాకింగ్‌ సదుపాయాలు, కోల్డ్‌స్టోరేజీలు, గోదాములు, ఆక్వాప్రాంతాల్లో ఇండివిడ్యువల్‌
క్విక్‌ ఫ్రీజింగ్‌ సదుపాయాలు ఏర్పాటు కావాలి:
ఇవన్నీ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దృష్టిపెట్టాల్సిన అంశాలని స్పష్టంచేసిన సీఎం:
రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్‌స్టోరేజీలు, గోదాముల అంశంలో స్వయం సమృద్ధి సాధించాలి: 
నిధులు ఎంతైనా ఒకసారి పెట్టి... వ్యవసాయరంగాన్ని పట్టాలమీదకు తీసుకు వచ్చే ప్రయత్నంచేద్దాం:
దీంతోపాటు ధరల స్థిరీకరణ నిధి రైతులకు అండగా నిలబడుతుంది:


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు