విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్   ఎఫ్ డి సి  చైర్మన్ విజయ్ చందర్ ఘన నివాళులు


విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్  
ఎఫ్ డి సి  చైర్మన్ విజయ్ చందర్ ఘన నివాళులు
విజయవాడ, ఏప్రిల్ 29: బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది  చైర్మన్               శ్రీ టి.ఎస్.విజయ్ చందర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు. ఇర్ఫాన్‌ బాలీవుడ్‌ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారని ఆయన అన్నారు. సినీ రంగానికి ఇర్ఫాన్ ఖాన్ చేసిన సేవలు మరువలేనివని విజయ్ చందర్ కొనియాడారు. సినీ రంగానికి ఇర్ఫాన్ ఖాన్ లేని లోటు తీర్చలేనిదని విజయ్ చందర్ అన్నారు. ఇర్ఫాన్ ఖాన్  మొదటి సినిమా ‘సలామ్ బాంబే’ అయితే,  తెలుగులో కూడా మహేష్ బాబు హీరోగా ఉన్న  సైనికుడు సినిమాలో నటించారని , తెలుగు పరిశ్రమతో కూడా ఆయనకు అవినాభావ సంబంధం ఉందని ఎఫ్ డి సి చైర్మన్ తెలిపారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు విజయ్ చందర్  ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


 


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020