ఎం.ఎస్‌.ఎం.ఈ.లకు వైయస్‌.జగన్‌ ప్రభుత్వం ఊరట

30–04–2020
అమరావతి


ఎం.ఎస్‌.ఎం.ఈ.లకు వైయస్‌.జగన్‌ ప్రభుత్వం ఊరట


*కోవిడ్‌ –19 ప్రభావం నుంచి కాపాడేందుకు ఆర్థికరక్షణ ప్రణాళిక


*2014–15 నుంచి ఎంఎస్‌ఈలకు పెండింగులో ఉన్న బకాయిలు ఇవ్వాలని నిర్ణయం, మొత్తంగా రూ. 905 కోట్ల చెల్లింపులకు సీఎం నిర్ణయం*


*మే నెలలో సగం, జూన్‌ నెలలో సగం చెల్లించాలని నిర్ణయం*


*ఏప్రిల్, మే, జూన్‌.. ఈ మూడు నెలల కాలానికి ఎంస్‌ఎంఈలకు పవర్‌ డిమాండ్‌ ఛార్జీలు రూ. 188 కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం*


*తక్కువ వడ్డీకి రూ.200 కోట్ల రూపాయలను వర్కింగ్‌కేపిటల్‌గా ఎంఎస్‌ఎంఈలకు అందించాలని నిర్ణయం*


*మిగిలిన పరిశ్రమలకు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్‌)కరెంటు మినిమం డిమాండ్‌ ఛార్జీల చెల్లింపు వాయిదా* 


*కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు వచ్చాక టెక్ట్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి చర్యలు తీసుకుంటాన్న సీఎం*


అమరావతి: కోవిడ్‌–19 కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి పట్టాలకెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు
ఎంఎస్‌ఎంఈలు సహా కీలక రంగాల్లోని పరిశ్రమలను ఆదుకునేందుకు చర్యలు 
క్యాంపు కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి గౌతం రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్‌ జేఎన్వీ. సుబ్రహ్మణ్యం సహా ఇతర అధికారులు హాజరు


ఎంఎస్‌ఎంఈలను కాపాడేందుకు పలు రకాల ప్రతిపాదనలను నివేదించిన అధికారులు
గత సమావేశంలో సీఎం ఇచ్చిన సూచనల మేరకు ప్రతిపాదనలు చేసిన అధికారులు. ఈ ప్రతిపాదనలపై తీవ్ర చర్చ జరిగిన తర్వాత సీఎం ఈ కింద నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. 


1. ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల బకాయిలు చెల్లింపు:


– 2014–15 నుంచి పెండింగులో ఉన్న ఎంఎస్‌ఈల ప్రోత్సాహకాల బకాయిలను పూర్తిగా చెల్లించాల నిర్ణయం. విలువ రూ. 905 కోట్లు
– మే నెలలో, జూన్‌ నెలలో చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయం.
– 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకూ గత ప్రభుత్దవం హాయంలో ఎంఎస్‌ఈలకు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాల్సిన మొత్తం రూ.828 కోట్లు చెల్లించలేదన్న విషయంపై సమావేశంలో చర్చ. 
– సంవత్సరాలవారీగా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల రూపంలో బకాయిలు 
2014–15లో రూ.43 కోట్లు
2015–16లో  రూ. 70 కోట్లు
2016–17లో రూ. 195 కోట్లు
2017–18లో రూ. 207 కోట్లు
2018–19లో  రూ. 313 కోట్లు
అప్పటివరకూ మొత్తం రూ. 828 కోట్లు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20 ఎంఎస్‌ఈలకు ( అప్‌లోడ్‌ చేసిన వివరాల ప్రకారం) బకాయిలు రూ. 77 కోట్లు.
మొత్తంగా రూ.905 కోట్లను మే, జూన్‌ నెలలో ఎంఎస్‌ఎంఈలకు ఇస్తామని సీఎం ప్రకటన. 


2, ఏప్రిల్, మే, జూన్‌నెలలకు ఎంఎస్‌ఎంఈల మినిమం కరెంటు డిమాండ్‌ ఛార్జీల రద్దు:


– దీంతోపాటు  ఏప్రిల్, మే, జూన్‌నెలల కాలానికి ఎంఎస్‌ఎంఈల మినిమం విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీలను రద్దుచేయాలని నిర్ణయం. దాదాపు రూ.188 కోట్లమేర అన్ని ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి.


పై రెండు నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకూ, 24,252 చిన్న తరహా పరిశ్రమలకూ, 645 మధ్య పరిశ్రమలకూ మొత్తంగా 97, 428 ఎంఎస్‌ఎంఈలకు మేలు. వీటిలో 9,68,269 మందికి ఉపాధి. 


3. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈల తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇస్తూ  సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుని, రూ.200 కోట్లు సమకూర్చుకుని, వాటిని వర్కింగ్‌ కేపిటల్‌గా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అందించాలని నిర్ణయం. అతితక్కువ వడ్డీకింద ఈ వర్కింగ్‌ కేపిటల్‌ సమకూర్చాలని సమావేశంలో నిర్ణయం.


4. టెక్స్‌టైల్‌ పరిశ్రమల సహా, భారీ, అతిభారీ పరిశ్రమలకు 3నెలల ( ఏప్రిల్, మే, జూన్‌ నెలల) మినిమమం డిమాండ్‌ ఛార్జీల చెల్లింపును వాయిదా వేయాలని నిర్ణయం. ఎలాంటి అపరాథరుసుము, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ భారాన్ని  రాష్ట్ర ప్రభుత్వమే మోస్తుంది. దీనివల్ల అన్ని పరిశ్రమలకూ అదనపు వర్కింగ్‌క్యాపిటల్‌ సమకూరుతుంది. 


5. టెక్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను చెల్లించేదిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని సీఎం సమావేశంలో ప్రకటించారు. 


అంతేకాకుండా కోవిడ్‌–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా టెక్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలను అదుకోవడానికి ఆలోచనలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వెలువడినత తర్వాత మరోసారి సమీక్షచేసి టెక్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలనూ ఆదుకోవడానికి అన్నిచర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ  వైయస్‌.జగన్‌ సమావేశంలో స్పష్టంచేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు