వలస వాసులు కాలినడక ప్రయాణాలు చేయవద్దు :వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి

వలస వాసులు కాలినడక ప్రయాణాలు చేయవద్దు :వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి


వింజమూరు, ఏప్రిల్ 30 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వలస వాసులు ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో వారి వారి ప్రాంతాలకు చేరుకునేందుకు ఎట్టి పరిస్థితులలోనూ కాలినడకన ప్రయాణాలు చేయవద్దని వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సూదూర ప్రాంతాల నుండి పొట్ట చేతపట్టుకుని కూలీ పనులకు వచ్చిన వారి సమాచారమును సేకరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకు శ్రీకారం చుట్టనున్నామన్నారు. గురువారం సాయంత్రం వింజమూరు మండలంలోని చంద్రపడియ గ్రామం నుండి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంకు కాలినడకన బయలుదేరిన 6 మందిని పోలీసులు గుర్తించి వారిని తహసిల్ధారు కార్యాలయం వద్దకు తరలించారు. వీళ్ళు గత 3 నెలల క్రితం చంద్రపడియ గ్రామంలో రామాలయం నిర్మాణానికి కూలీలుగా రావడం జరిగింది. ఉగాది నాటికి పనులు పూర్తయినా అప్పటికే కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఈ కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న మొన్నటి వరకు చంద్రపడియ గ్రామంలోనే ఉంటున్న కూలీలు చివరికి గత్యంతరం లేని పరిస్థితులలో కాలినడకన పెద్దాపురంకు బయలుదేరారు. బుక్కాపురం రోడ్డు మార్గాన వెళుతున్న కూలీలను గుర్తించిన స్థానికులు ఎస్.ఐ బాజిరెడ్డికి సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన ఆయన కాలినడకన వెళుతున్న కూలీలకు నచ్చజెప్పి వింజమూరు మండల కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఈ ఎండలలో కాలినడక అత్యంత ప్రమాదకరమని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు