ప్రపంచమంతా స్తంభించినా వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలు ఆగటం లేదు : కళా వెంకట్రావు

 29.04.2020


ప్రపంచమంతా స్తంభించినా వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలు ఆగటం లేదు


.............కళా వెంకట్రావు


కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంతా స్తంభించినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ నేతల అక్రమాలు,అరాచకాలు, అవినీతి  కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమంగా మద్యం, ఇసుక అమ్ముకుంటున్నారు, రేషన్ బియ్యం దోచుకుంటున్నారు, భూములు కబ్జా చేస్తున్నారు.  మరో వైపు వాలంటీర్లు గ్రామాల్లో నాటు సారా తయారీ చేస్తున్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యమే దిక్కు, కానీ వైసీపీ నేతలు కకక్కుర్తి తో పేదల నోటి కాడి కూడు కూడా లాగేస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి కి సంబంధించిన ట్రస్ట్  కి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ పట్టు బడ్డారు. కానీ దీనిపై ఇంత వరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎందుకు స్పందించలేదు.దీనిపై విచారణ జరిపి ఎంపీ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు. వైసీపీకి తమ తప్పుల్ని టీడీపీ పై కి నెట్టడం అలవాటు, కానీ ప్రజలు నమ్మకపోయే సరికి నోరు లేని మూగ జీవాలపైకి నెడుతున్నారు. అద్దంకి లో   లాక్ డౌన్ నింబంధనలు ఉల్లంగించి అక్రమంగా మద్యం అమ్ముకుని ఎలుకలు తాగాయాని  అనటం వింతగా ఉంది.  నేడు ఇసుక అక్రమంగా దోచేస్తున్నారు, రేపు విచారణ లో ఆకలేసి ఇసుకను చేపలు తినేశాయని చెబుతారేమో. దొంగకు దొరికింది ఛాన్స్ అన్నట్లుగా వైసీపీ నేతలకి లాక్ డౌన్ కలిసొచ్చింది. ప్రజలంతా ఇళ్లలో ఉంటే వైసీపీ నేతలు విశాకలో భూములు కబ్జా చేసి గుట్టు చప్పుడు కాకుండా లేఅవుట్లు వేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఏమో వలంటీర్లు రేషన్ డోర్ డెలివరీ చేస్తూ ప్రజలకు సేవలు చేస్తున్నారని అంటారు. వాస్తవానికి మాత్రం వలంటీర్లు నాటు సారా కాసి ఇంటిటికీ  కాసి డోర్ డెలివరీ చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. వైసీపీ నేతల అక్రమాలపై ముఖ్యమంత్రి  జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.  తన కమీషన్ల కోసం కామ్ గా ఉన్నారా? మంత్రులు ప్రజా సేవ   చేయటం కంటే ప్రజా ధనం దోచుకోవటంలో పోటీ పడుతున్నారు. వైసీపీ నేతలు కలలో కూడా చంద్రబాబు నాయుడు ని చూసి భయ పడుతున్నారు. మంత్రులు తమ పదవులు కాపాడుకునేందుకే టీడీపీని, చంద్రబాబు నాయుడు ని విమర్శిస్తున్నారు. 


S/D


కళా వెంకట్రావు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు