భౌతిక దూరం పాటించండి......లేకుంటే భౌతికకాయంగా  మారతారు :యేమినేని వెంకటరమణ ...ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి.......

*ఆనాడు అంటరానితనం నిర్మూలన ........నేడు అంటరానితనమే కరోనా నియంత్రణ*


*ఆనాడు చావుకూడా పెల్లిలాంటిదే...........నేడు కరోనా చావు పగవాడిక్కూడా వద్దు*


విజయవాడ ఏప్రిల్..27..
కాలం మారింది ఈ కలికాలంలో కరోనా కోవిడ్ 19 వైరస్ ప్రపంచ దేశాలను కరాళ నృత్యం తో అల్లాడిస్తుంది మనం మృత్యువాత పడకుండా ఉండాలంటే  అంటరానితనం పాటించాల్సిందే పూర్వీకులు అంటరానితనం పాటిస్తే సంఘసేవకుల ,దేశోద్ధారకులు, చరిత్ర మూలపురుషులు  అంటరానితనంపై ఉద్యమాలు చేశారు ఫలితం సాధించి ప్రజలందరూ సమానులే  ఎలుగెత్తి చాటారు  ....
నేడు పరిస్థితులు మారాయి దూరంగా దూరంగా ఉండాలని పాలకులే  పదే పదే చెబుతున్నారు వారి సూచనలు పాటించండి ..కరోనా కేసుల సంఖ్యలు పెరిగి బెజవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు ఇంకా జనాల్లో జంకు బొంకు లేదు 


పోలీసులు, వైద్యులు , నర్సులు,వార్డు వాలేంటీర్లు, చివరకు జర్నలిస్టులు కూడా కరోనా బారినపడి మృత్యు భయంతో విలవిల్లాడుతున్నారు .....
ఇంటినుండి బయటకు రావద్దు...ఇంట్లోకి కరోనా తేవద్దని .అధికారులు నెత్తీనోరు మొత్తుకొంటున్నా ప్రజలు వినడంలేదు ఏదోవిధంగా బయటకు వస్తున్నారు .........
స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అని... ఆకలిరాజ్యం..సినిమాకు రాసిన పాటలో మనసుకవి ఆచార్య ఆత్రేయ తెలిపారు అంటే పెళ్లికి దూరపు బంధువులు వస్తారు  చావుక్కుడా బంధువులు వస్తారు  పెళ్లి చావుకూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి...


నేడు పెళ్లికూడా చేసుకునేందుకు వీలు లేక వాయిదాలు పడుతున్నాయి .....కరోనా చావు వాయిదా పడదుగా .... గ్రహచారం బాగుండక కరోనా కాటేసి మృత్యువాత వాత పడితే .......


పురాణాలు పుక్కిట పట్టినవారి కొడుకు కూడా మనల్ని పున్నామ నరకంనుండి తప్పించడానికి తలకొరివి పెట్టె అవకాశం ఉండదు ......పాడే  మోయడానికి ...నలుగురు....కూడా ముందుకు రారు........ బతికున్నాళ్లు ....అమ్మా నాన్న, భార్యాబిడ్డలు కోసం తహతహలాడినవారంతా ...అభాగ్యులుగా  అనాధాలుగా .....
దిక్కులేని శవాలుగా హంగు ఆర్భాటంలేని ,కనీసం అంతిమయాత్ర కూడలేని  స్థితికి తెచ్చుకోవడం కోసం నిబంధనలు ఉల్లంఘించి బయట తిరగొద్దు ........
బయటకు రాకుంటే ప్రాణం పోదు...బయటకు వస్తేనే చస్తాం ....
కంటికి కనిపించని కరోనా నగరంలో ,రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో  సర్వాంతర్యామిలా  విస్తృతంగా ప్రభావం చూపుతుంది .....
ప్రపంచంలో ప్రసిద్ద దేవాలయాలు ,ప్రార్ధనా మందిరాలు మూతపడ్డాయి ఏదేవుడూ  మనల్ని కపడలేరు .....స్వీయనియంత్రనే  మనకు రక్ష  అందుకే ప్రభుత్వ అధికారులు సూచనలు పాటించండి ....
ఇంటినుండి బయటకు రాకుండా కరోనా నియంత్రణలో భాగస్వాములు కండి......
చెప్పి చెప్పి విసుగెత్తి  నిరంతర కర్వ్యూ వరకు తెచుకోవద్దు....... 
మాస్కులు ధరించండి ...భౌతిక దూరం పాటించండి......లేకుంటే భౌతికకాయంగా  మారతారు ...జాగ్రత్త....... ఇట్లు...... యేమినేని వెంకటరమణ ...ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి.......


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు